Political News

ఇది టీఆర్ఎస్‌, బీజేపీ గేమ్ ప్లాన్‌: రేవంత్ ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్‌, బీజేపీల‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ రెండు పార్టీల గేమ్ ప్లాన్ అంద‌రికీ తెలుస‌ని.. అన్నారు. వ్యూహాత్మ‌కంగా..రెండూ వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్‌, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్‌ ఎంపీలు సభకే హాజరుకాలేదని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చెల్లించిన డబ్బును పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ ఖర్చు చేస్తున్నారన్నారు. సెప్టెంబరు 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలో ఏఐసీసీ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కసరత్తు టీపీసీసీ స్థాయిలో పూర్తయిందని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే రాజాసింగ్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నార‌ని ఆరోపించారు. ఉపఎన్నికల వేళ ఓట్ల కోసం కొత్తగా విద్యుత్‌ బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ నేత విమర్శించారు.

కవిత మీద బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ, మరి ఆమె ఇంటికి ఈడీ ఎందుకు వెళ్లడం లేదు. బీజేపీ బ్లాక్ మెయిల్ చేసి ప్రొటెక్షన్ మనీ సంపాదిస్తోంది. రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు.. మోడీ మోకాళ్ల యాత్ర చేస్తారా? బంగాల్‌ మోడల్ ఇక్కడ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో టీఆర్ఎస్‌, బీజేపీ డ్రామాలు చేస్తున్నాయి. బండి పాద యాత్ర వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం లేదు. ఆయనకు మోకాళ్ల చిప్పలు అరుగుతాయి.. అని నిప్పులు చెరిగారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago