Political News

తెలంగాణ‌కు మ‌రోషాక్‌.. ఏపీ బాకీ చెల్లించాల‌ని కేంద్రం ఆదేశం

తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారుకు కేంద్రం తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను వ‌డ్డీతో సహా క‌లిపి మొత్తం 6,800 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని సూచించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ డిస్కంలు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయని పేర్కొంది.

దీనికి సంబంధించిన 3441.78 కోట్ల రూపాయల బకాయిలతో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించింది.  పునర్విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఆదేశాలు ఇస్తున్నామని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ అనూప్‌ సింగ్ బిస్త్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శికి లేఖ రాశారు. 

పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ జెన్కో  నుంచి 2014 నుంచి 2017 వరకూ సరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ డిస్కంలు బిల్లులు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. 2014 మార్చి 28న జరిగిన సమావేశంలో ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాపై నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పటివరకూ రెండు ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా తెలంగాణ చెల్లించలేదని తెలిపారు. 30 రోజుల్లోపు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించారు.

తెలంగాణ జెన్కో సీఎండీ తో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారులకు ఈ కాపీలు పంపారు. ఇక‌, దీనిపై కేసీఆర్ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మ‌రోవైపు.. రెండు రోజుల కింద‌ట ఏపీ ప్ర‌భుత్వం కేంద్రం వ‌ద్దకు వెళ్లి.. తెలంగాణ విద్యుత్ బ‌కాయిలు ఇప్పించాల‌ని కోర‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఈ ప‌రిణామం.. ఇరు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కాక‌పుట్టించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

This post was last modified on August 30, 2022 8:57 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సరైన దారిలో విజయ్ దేవరకొండ

ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఊహించని డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నిజానికి గీత గోవిందంని మించిన అంచనాలు…

2 hours ago

పవన్ ని తప్పయితే, మోడీది కూడా తప్పే కదా జగన్

తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్…

3 hours ago

బీహార్ లో బీజేపీ కోటకు బీటలు !

బీహార్ లో బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్…

3 hours ago

సికందర్ జోడిగా రష్మిక మందన్న

గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది…

4 hours ago

రొటీన్ అంటూనే 50 కోట్లు లాగేసింది

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు…

4 hours ago

ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు షాకింగ్ న్యూస్ !

ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే…

5 hours ago