Political News

ఆంధ్రా అష్ట‌దిగ్బంధం.. కాలు క‌దిపితే నిఘా నేత్రం!

మ‌రొక్క రోజులో వినాయ‌చ‌వితి పండుగ. పిల్లాపాప‌ల‌తో అంద‌రూ ముచ్చ‌ట‌గా చేసుకునే తొలి పండుగ‌. ఇంటిల్లి పాదీ బ‌య‌ట‌కు వ‌చ్చి.. అంతో ఇంతో సంతోషంగా గ‌డిపే స‌మ‌యం. కానీ.. ఇది ఏపీ ప్ర‌జ‌ల‌కు దూరం కానుంది. ఎందుకంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పు డు పోలీసుల అష్ట‌దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. కాలు క‌దిపితే.. ఎవ‌రు ఉద్యోగో.. ఎవ‌రు సామాన్య పౌరులో తెలుసుకునేందుకు పోలీసులు వెంటాడేస్తున్నారు. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చే పౌరులు త‌మ గుర్తింపు ప‌త్రాల‌తో రావాల్సిన అనివార్య ప‌రిస్తితిని ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. దీనికి కార‌ణం.. ఉద్యోగులు ఇచ్చిన సెప్టెంబ‌రు 1 సీఎం ఇంటిముట్ట‌డి పిలుపే!!

సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 న ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్షించారు. చలో విజయవాడకు ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి రాలేదు. ఉద్యోగులు విజయవాడ రాకుండా తీసుకుంటున్న చర్యలు, తనిఖీలు, ముందస్తు అరెస్టులు, నిఘా తదితర అంశాలను సీఎంకు వివరించారు. ఆంధ్రాని అష్ట‌దిగ్బంధం చేసిన‌ట్టు ఆయ‌న తెలిపార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పాయి.

మ‌రోవైపు సీఎం కూడా చ‌లో విజయవాడ ఉద్య‌మాన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి ప‌లు అంశాల‌తో దిశానిర్దేశం చేశారు. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతులు సహా భద్రతపై డీజీపీతో సీఎం చర్చించారు. ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై వివ‌రించాల‌ని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. పౌరులు పోలీసుల‌తో వివాదాల‌కు దిగ‌కుండా.. చేతిలో గుర్తింపు కార్డు పెట్టుకోవాల‌ని.. ప్ర‌జాస్వామ్య వాదులు సూచిస్తున్నారు. లేక‌పోతే..ఊచ‌లు లెక్క‌పెట్ట‌డం.. కుటుంబాల‌కు పండ‌గ పూట క‌న్నీరు మిగ‌ల్చ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ప‌ట్టు వీడ‌ని ఉద్యోగులు

ఒక‌వైపు ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించి అష్ట‌దిగ్బంధం చేస్తున్నా.. ఉద్యోగులు ప‌ట్టు వీడ‌డం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చిన సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని శాంతియుత ప్రదర్శనకు పిలుపినిస్తే, అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇప్పటికే సీపీస్ రద్దుపై సంబంధిత మంత్రులతో చర్చలు జరిపిన ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అంధ్రప్రదేశ్లో సైతం అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీస్ విధానాన్ని రద్దు చేసి.. ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సంఘాల నేత‌లు తేల్చి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ భ‌యం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. పోలీసులు ప్ర‌తి ఒక్క‌రినీ అనుమాన‌పు చూపుల‌తో చూస్తుండ‌డం మ‌రింత దారుణంగా మారింది.

This post was last modified on August 29, 2022 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్… కొంతయినా జాలి కలిగేనా?

దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్‌ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…

9 minutes ago

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

2 hours ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

4 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

4 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

5 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

9 hours ago