ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్నవారు.. వచ్చితీరాలని చెబుతున్న పార్టీ అధినేతలు కూడా.. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న కీలకైన మూడు అంశాలను పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. వాటిలో కీలకమైన.. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం.. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రజల్లో ఇప్పటికీ.. కీలక అంశాలుగానే చర్చ సాగుతోంది. ఈ సెంటిమెంటును సాధించుకోవాలనే తపన కూడా.. ప్రజల్లో ఉంది.
గత ఎన్నికల్లో ఈ మూడు అంశాలను ప్రధానంగా వైసీపీ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. జనాలు కూడా నమ్మారు. ఓట్లు కుమ్మరించారు. ఇంకేముంది.. మేం అధికారంలోకి వస్తే.. కేంద్రం మెడలు వంచైనా.. సాధిస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ మూడు అంశాలను పక్కకు పెట్టేసి.. కేంద్రాన్ని ప్లీజ్ అనడం తప్ప.. ఇప్పుడు చేసేది ఏమీ లేదని చెప్పారు. దీంతో వైసీపీపై ప్రజల్లో అసహనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయా అంశాలను లేనవనెత్తే పార్టీల వైపు.. ప్రజలు చూస్తున్నారు.
కానీ, అధికారం కోసం చూస్తున్న టీడీపీ కానీ, జనసేన కానీ.. ప్రజల సెంటిమెంటును పట్టించుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. వారు నిర్దేశించిన కార్యక్రమాలను ప్రజలపై రుద్దుతున్నారని.. మేధావులు అంటున్నారు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వారికి ఏం చేయాలి.. అనేది ఇప్పుడు ముఖ్యం. పార్టీల అజెండా కన్నా..ప్రజల అజెండాతో ముందుకువ స్తే.. ఏపీలో విజయం దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు. ఇదే వైసీపీ అప్పట్లో చేసింది. ప్రజల నాడిని పట్టుకుంది. అయితే.. వాటిని నెరవేర్చడంలోవిఫలమైంది.. అని కొందరు మేధావులు బాహాటంగానే చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికైనా.. అధికారంలోకి రావాలని.. సీఎం కావాలని కోరుకుంటున్న పార్టీలు.. నాయకులు కూడా.. ప్రజల మనసులో మాట వింటే.. బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. దీనిపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంకా ఎన్నికలకు చాలానే సమయం ఉంది కాబట్టి.. ప్రజల సెంటిమెంటు ఆయుధంగా చేసుకుంటే.. మంచి ఫలితం వస్తుందనే దిశగా అడుగులు వేయాలని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on August 29, 2022 1:43 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…