Political News

ఏపీలో ఓటు మంత్రాలు.. మూడే

ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న‌వారు.. వచ్చితీరాల‌ని చెబుతున్న పార్టీ అధినేతలు కూడా.. రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్న కీల‌కైన మూడు అంశాల‌ను ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న వినిపిస్తోంది. వాటిలో కీల‌క‌మైన‌.. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిర్మాణం.. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ.. కీల‌క అంశాలుగానే చ‌ర్చ సాగుతోంది. ఈ సెంటిమెంటును సాధించుకోవాల‌నే త‌ప‌న కూడా.. ప్ర‌జ‌ల్లో ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు అంశాల‌ను ప్ర‌ధానంగా వైసీపీ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. జ‌నాలు కూడా న‌మ్మారు. ఓట్లు కుమ్మ‌రించారు. ఇంకేముంది.. మేం అధికారంలోకి వ‌స్తే.. కేంద్రం మెడ‌లు వంచైనా.. సాధిస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ మూడు అంశాల‌ను ప‌క్క‌కు పెట్టేసి.. కేంద్రాన్ని ప్లీజ్ అన‌డం త‌ప్ప‌.. ఇప్పుడు చేసేది ఏమీ లేద‌ని చెప్పారు. దీంతో వైసీపీపై ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయా అంశాల‌ను లేన‌వనెత్తే పార్టీల వైపు.. ప్ర‌జ‌లు చూస్తున్నారు.

కానీ, అధికారం కోసం చూస్తున్న టీడీపీ కానీ, జ‌న‌సేన కానీ.. ప్ర‌జ‌ల సెంటిమెంటును ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు.. వారు నిర్దేశించిన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్నారని.. మేధావులు అంటున్నారు.. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు.. వారికి ఏం చేయాలి.. అనేది ఇప్పుడు ముఖ్యం. పార్టీల అజెండా క‌న్నా..ప్ర‌జ‌ల అజెండాతో ముందుకువ స్తే.. ఏపీలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. ఇదే వైసీపీ అప్ప‌ట్లో చేసింది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుంది. అయితే.. వాటిని నెర‌వేర్చ‌డంలోవిఫ‌ల‌మైంది.. అని కొంద‌రు మేధావులు బాహాటంగానే చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా.. అధికారంలోకి రావాల‌ని.. సీఎం కావాల‌ని కోరుకుంటున్న పార్టీలు.. నాయ‌కులు కూడా.. ప్ర‌జ‌ల మ‌న‌సులో మాట వింటే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. దీనిపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంకా ఎన్నిక‌లకు చాలానే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల సెంటిమెంటు ఆయుధంగా చేసుకుంటే.. మంచి ఫ‌లితం వ‌స్తుంద‌నే దిశ‌గా అడుగులు వేయాల‌ని మేధావులు చెబుతున్నారు.

This post was last modified on August 29, 2022 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

1 hour ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

3 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

3 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

4 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

8 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

9 hours ago