ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్నవారు.. వచ్చితీరాలని చెబుతున్న పార్టీ అధినేతలు కూడా.. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న కీలకైన మూడు అంశాలను పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. వాటిలో కీలకమైన.. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం.. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రజల్లో ఇప్పటికీ.. కీలక అంశాలుగానే చర్చ సాగుతోంది. ఈ సెంటిమెంటును సాధించుకోవాలనే తపన కూడా.. ప్రజల్లో ఉంది.
గత ఎన్నికల్లో ఈ మూడు అంశాలను ప్రధానంగా వైసీపీ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. జనాలు కూడా నమ్మారు. ఓట్లు కుమ్మరించారు. ఇంకేముంది.. మేం అధికారంలోకి వస్తే.. కేంద్రం మెడలు వంచైనా.. సాధిస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ మూడు అంశాలను పక్కకు పెట్టేసి.. కేంద్రాన్ని ప్లీజ్ అనడం తప్ప.. ఇప్పుడు చేసేది ఏమీ లేదని చెప్పారు. దీంతో వైసీపీపై ప్రజల్లో అసహనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయా అంశాలను లేనవనెత్తే పార్టీల వైపు.. ప్రజలు చూస్తున్నారు.
కానీ, అధికారం కోసం చూస్తున్న టీడీపీ కానీ, జనసేన కానీ.. ప్రజల సెంటిమెంటును పట్టించుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. వారు నిర్దేశించిన కార్యక్రమాలను ప్రజలపై రుద్దుతున్నారని.. మేధావులు అంటున్నారు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వారికి ఏం చేయాలి.. అనేది ఇప్పుడు ముఖ్యం. పార్టీల అజెండా కన్నా..ప్రజల అజెండాతో ముందుకువ స్తే.. ఏపీలో విజయం దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు. ఇదే వైసీపీ అప్పట్లో చేసింది. ప్రజల నాడిని పట్టుకుంది. అయితే.. వాటిని నెరవేర్చడంలోవిఫలమైంది.. అని కొందరు మేధావులు బాహాటంగానే చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికైనా.. అధికారంలోకి రావాలని.. సీఎం కావాలని కోరుకుంటున్న పార్టీలు.. నాయకులు కూడా.. ప్రజల మనసులో మాట వింటే.. బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. దీనిపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంకా ఎన్నికలకు చాలానే సమయం ఉంది కాబట్టి.. ప్రజల సెంటిమెంటు ఆయుధంగా చేసుకుంటే.. మంచి ఫలితం వస్తుందనే దిశగా అడుగులు వేయాలని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on August 29, 2022 1:43 pm
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…