ఏపీలో వివాదానికి కారణమైన మూడు రాజధానుల విషయం.. మరోసారి తెరపైకి రానుందా? ప్రభుత్వం తన పట్టును సమర్థించుకునేందుకు.. సాధించుకునేందకే ప్రాధాన్ం ఇస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీనిపై పెద్ద దుమారమేరేగింది. రాజధాని రైతులు.. ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు.. అమరావతికే మొగ్గు చూపింది.
రాజధాని అమరాతినే అభివృద్ది చేయాలని.. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు.. వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు అప్పగించాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే.. అది కూడా కేవలం మూడు మాసాల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ.. ఇది జరిగి 8నెలలు అయినా.. కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడ చేసింది ఏమీ కనిపించడం లేదు. దీంతో మరోసారి.. రైతులు ఉద్యమించేందుకురెడీ అవుతున్నారు.
ఈ దఫా.. అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 2 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని మరింత రెచ్చగొట్టేలా నిర్ణయం తీసుకున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు అడ్వకేట్ జనరల్ శ్రీరాం స్వయంగా ఓ మీడియాకు వెల్లడించడం గమనార్హం.
దీనిని బట్టి.. సర్కారు మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైసీపీలో జరుగుతున్న చర్చలను బట్టి.. దసరా తర్వాత లేదా.. అదే రోజు నుంచి సీఎం జగన్ విశాఖలోనే ఉంటారని.. అక్కడ నుంచి పాలన సాగిస్తారని తెలుస్తోంది. ఇది అధికారికంగా కాకుండా.. అనధికారికంగా అక్కడ నుంచి పాలన సాగిస్తారని చెబుతున్నారు. దీనిని బట్టి.. సర్కారు మూడు రాజధానులకే మొగ్గు చూపుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎలాంటి పరిణామాలకుదారితీస్తుందో చూడాలి.
This post was last modified on August 29, 2022 2:39 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…