Political News

మూడు రాజ‌ధానుల‌కే ఏపీ మొగ్గు..

ఏపీలో వివాదానికి కార‌ణ‌మైన మూడు రాజ‌ధానుల విష‌యం.. మ‌రోసారి తెర‌పైకి రానుందా?  ప్ర‌భుత్వం త‌న ప‌ట్టును స‌మ‌ర్థించుకునేందుకు.. సాధించుకునేంద‌కే ప్రాధాన్ం ఇస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు పరిశీల‌కులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై పెద్ద దుమార‌మేరేగింది. రాజ‌ధాని రైతులు.. ఉద్య‌మించారు. పాద‌యాత్ర‌లు చేశారు. న్యాయ‌పోరాటానికి దిగారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర హైకోర్టు.. అమ‌రావ‌తికే మొగ్గు చూపింది.

రాజ‌ధాని అమ‌రాతినే అభివృద్ది చేయాల‌ని.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందం మేర‌కు.. వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు అప్ప‌గించాలని, మౌలిక స‌దుపాయాలను క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే..  అది కూడా కేవ‌లం మూడు మాసాల్లోనే ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. కానీ.. ఇది జ‌రిగి 8నెల‌లు అయినా.. కూడా ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌రకు ఇక్క‌డ చేసింది ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో మ‌రోసారి.. రైతులు ఉద్య‌మించేందుకురెడీ అవుతున్నారు.

ఈ ద‌ఫా.. అమ‌రావ‌తి నుంచి అరస‌వ‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. సెప్టెంబరు 2 నుంచి ఈ పాద‌యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వారిని మ‌రింత రెచ్చ‌గొట్టేలా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టులో స‌వాల్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరాం స్వ‌యంగా ఓ మీడియాకు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. స‌ర్కారు మూడు రాజ‌ధానుల‌కే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు.. వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి..  ద‌స‌రా త‌ర్వాత లేదా.. అదే రోజు నుంచి సీఎం జ‌గ‌న్ విశాఖలోనే ఉంటార‌ని.. అక్క‌డ నుంచి పాల‌న సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇది అధికారికంగా కాకుండా.. అన‌ధికారికంగా అక్క‌డ నుంచి పాల‌న సాగిస్తార‌ని చెబుతున్నారు. దీనిని బ‌ట్టి.. స‌ర్కారు మూడు రాజ‌ధానుల‌కే మొగ్గు చూపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎలాంటి ప‌రిణామాల‌కుదారితీస్తుందో చూడాలి.

This post was last modified on August 29, 2022 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆషురెడ్డి ఆడియో వైరల్

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్‌కు…

9 minutes ago

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం…

7 hours ago

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…

9 hours ago

క‌న్నీళ్ల‌తో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్త‌రాది అమ్మాయి పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయ‌ల్…

11 hours ago

చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…

12 hours ago

దురంధర్ కాంబో రిపీట్ కానుందా

ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…

12 hours ago