Political News

ఏపీలో పొలిటిక‌ల్ సెగ‌లు

ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. అధికార పార్టీ తీరును ఎండ‌గ‌డుతూ.. ఇప్ప‌టికే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మానికి కూడా త‌మముళ్ల‌ను స‌మాయ‌త్తం చేస్తోంది. సెప్టెంబ‌రు 1 నుంచి ఈ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు.. అదే రోజున ఉద్యోగులు కూడా సీపీఎస్ కోసం ఉద్య‌మాన్ని మ‌రింత వేగవంతం చేయ‌నున్నారు. `సీఎం ఇంటి ముట్ట‌డి`కి, మిలియ‌న్ మార్చ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వేడి ఒక‌వైపు స‌ర్కారును రిస్క్ పెడుతుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా రెడీ అయింది.

రాష్ట్రంలో వినాయ‌క‌చ‌వితి పందిళ్ల‌ను వేసేవారి నుంచి రిజిస్ట్రేష‌న్ రుసుమును వ‌సూలు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు.. వలంటీర్ల‌ను రంగంలోకి దింపారు. పోలీసు స్టేష‌న్ల‌లోనూ.. రిజిస్ట్రేష‌న్ల రుసుము ప‌త్రాలు చూపిస్తేనే అనుమ‌తులు ఇస్తున్నారు. దీంతో ఈ విష‌యంపై బీజేపీ రాజ‌కీయ దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్నయించింది. సోమ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించాల‌ని.. పార్టీ నిర్న‌యం తీసుకోవ‌డంతో.. వ‌చ్చే నాలుగు రోజులు .. ఏపీ మ‌రింత హీటెక్క‌నుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్టాడుతూ.. స‌ర్కారుపై సీరియ‌స్ అయ్యారు. విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాలా అని మండిపడ్డారు. నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా సోమ‌వారం నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా  ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడ్డారు.

ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను, ఉత్సవ సమితి సభ్యులను వేధిస్తూ.. ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలకు దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే.. సోమ‌వారం నుంచి ఓ నాలుగు రోజుల పాటు ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయ‌నేది వాస్త‌వం.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

2 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

2 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

2 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

3 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

4 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

5 hours ago