Political News

వైఎస్ భార‌తిపై టీడీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఢిల్లీలో వెలుగు చూసింద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై అనేక వార్త‌లు.. వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇది రాజ‌కీ యంగా అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార పార్టీల నేత‌ల‌పైనా.. ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బీజేపీ నేత‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత పాత్ర ఉంద‌ని ఢిల్లీలో ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆమె ప‌రువున‌ష్టం దావా వేశారు. అయితే.. ఇప్పుడు ఈ వివాదంలో తొలిసారి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జోక్యం చేసుకుంది. ఏపీ టీడీపీ నాయ‌కులు.. ఈ స్కాంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి.. భార‌తి హ‌స్తం ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా జ‌గ‌న్-భార‌తిల పెళ్లిరోజే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ భారతి, ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులని టీడీపీ కీల‌క నాయ‌కుడు, పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు(ఈయ‌న ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త‌మ్ముడు). ఢిల్లీలో తీగలాగితే.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ భారతి నడుపుతున్న జగతి పబ్లికేషన్స్కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్కి.. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించిందన్నారు.

జగన్ కేసుల్లో ఏ5గా ఉన్న ట్రైడెంట్, అదే సంస్థ అధిపతి పెనాక శరత్చంద్రారెడ్డి ఏ8గా ఉన్నారని వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వీళ్లదే కీలకపాత్రని ఆరోపించారు. అదాన్ డిస్టిల్లరీస్ ద్వారా అక్రమంగా సంపాదించిన రూ. 5వేల కోట్ల సొమ్మును ఢిల్లీ స్కాంలో ఉపయోగించినట్లు చెప్పారు. ప్రస్తుత అదాన్ డైరెక్టర్ శ్రీనివాస్, విజయసాయి రెడి అల్లుడు రోహిత్ రెడ్డి నాలుగు కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు.

అరబిందో గ్రూపునకు సంబంధించిన చాలా కంపెనీల్లో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, వారి కుటుంబసభ్యుల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో కేసు ప్రారంభం నుంచి.. నేటి మద్యం కుంభకోణం వరకు జరిగిన పరిణామాలన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లింది కూడా ఈ మద్యం కుంభకోణంలో తన భార్యను కాపాడుకునేందుకేనని విమర్శించారు. అయితే.. ఇన్ని లెక్క‌లు ప‌క్కాగా చెబుతుండ‌డంతో ఆనం వ్యాఖ్య‌ల‌ను తోసిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇది మ‌రింత వివాదంగా మారి.. ఇరు పార్టీల మ‌ధ్య భూకంపం సృష్టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago