Political News

వైఎస్ భార‌తిపై టీడీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఢిల్లీలో వెలుగు చూసింద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై అనేక వార్త‌లు.. వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇది రాజ‌కీ యంగా అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార పార్టీల నేత‌ల‌పైనా.. ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బీజేపీ నేత‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత పాత్ర ఉంద‌ని ఢిల్లీలో ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆమె ప‌రువున‌ష్టం దావా వేశారు. అయితే.. ఇప్పుడు ఈ వివాదంలో తొలిసారి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జోక్యం చేసుకుంది. ఏపీ టీడీపీ నాయ‌కులు.. ఈ స్కాంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి.. భార‌తి హ‌స్తం ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా జ‌గ‌న్-భార‌తిల పెళ్లిరోజే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ భారతి, ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులని టీడీపీ కీల‌క నాయ‌కుడు, పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు(ఈయ‌న ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త‌మ్ముడు). ఢిల్లీలో తీగలాగితే.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ భారతి నడుపుతున్న జగతి పబ్లికేషన్స్కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్కి.. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించిందన్నారు.

జగన్ కేసుల్లో ఏ5గా ఉన్న ట్రైడెంట్, అదే సంస్థ అధిపతి పెనాక శరత్చంద్రారెడ్డి ఏ8గా ఉన్నారని వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వీళ్లదే కీలకపాత్రని ఆరోపించారు. అదాన్ డిస్టిల్లరీస్ ద్వారా అక్రమంగా సంపాదించిన రూ. 5వేల కోట్ల సొమ్మును ఢిల్లీ స్కాంలో ఉపయోగించినట్లు చెప్పారు. ప్రస్తుత అదాన్ డైరెక్టర్ శ్రీనివాస్, విజయసాయి రెడి అల్లుడు రోహిత్ రెడ్డి నాలుగు కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు.

అరబిందో గ్రూపునకు సంబంధించిన చాలా కంపెనీల్లో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, వారి కుటుంబసభ్యుల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో కేసు ప్రారంభం నుంచి.. నేటి మద్యం కుంభకోణం వరకు జరిగిన పరిణామాలన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లింది కూడా ఈ మద్యం కుంభకోణంలో తన భార్యను కాపాడుకునేందుకేనని విమర్శించారు. అయితే.. ఇన్ని లెక్క‌లు ప‌క్కాగా చెబుతుండ‌డంతో ఆనం వ్యాఖ్య‌ల‌ను తోసిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇది మ‌రింత వివాదంగా మారి.. ఇరు పార్టీల మ‌ధ్య భూకంపం సృష్టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 29, 2022 8:12 am

Share

Recent Posts

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

14 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

17 hours ago