రాజకీయంగా పట్టు సాధించాలని.. ఏ పార్టీ అధినేతకైనా ఉంటుంది. అయితే.. దీనికి సంబంధించి అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా.. అంతా నాకే దక్కాలి.. అన్ని సీట్లలోనూ నేనే విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని.. లక్ష్యంగా.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ క్రమంలో ఇతర పార్టీలను.. ట్రీట్ చేస్తున్న తీరు మాత్రం వివాదాలకు.. విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ..రాష్ట్రంలో రాజకీయ వైరాలు.. ప్రత్యర్థులను నిలువరించడం..అనేది కొత్తకాదు.
ఇప్పుడే.. టీడీపీ పుట్టింది కూడా లేదు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా.. చంద్రబాబును నిలు వరించే ప్రయత్నాలు సాగాయి. అయితే.. ఆయనను వ్యక్తిగతంగా ఓడించాలని.. కుప్పంలో ఆయన పార్టీని భూస్థాపితం చేయాలని.. ఎప్పుడూ.. వైఎస్ అనుకోలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా లక్ష్యంగా పెట్టుకోలేదు. రాజకీయంగా అనేక వైరాలు ముందుకు సాగాయి. అయితే.. ఇప్పుడు… పరిస్థితి మారిపోయి.. వ్యక్తిగతంగా చంద్రబాబుపై కసి తీర్చుకోవాలనే ధోరణి పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే .. కుప్పంపై జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక ఆపరేషన్లు సాగుతున్నాయి. ఇక్కడ మిని మునిసిపాలిటీని ప్రకటించారు. అదేసమయంలో అందరికీ పింఛన్లు ఇస్తున్నారు. నాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారు. రాష్ట్రంలో అందరికీ 1వ తేదీనే పింఛన్లు ఇస్తుంటే.. కుప్పంలో మాత్రం 30 లేదా.. 31వ తారీకు(అంటే.. 1వ తేదీ కంటే ముందే) అర్ధరాత్రి నుంచే పింఛన్లు ఇస్తున్నారు. ఇక, ఇటీవల 66 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. ఇవన్నీ మంచిదే.. రాజకీయంగా పట్టు సాధించేందుకు అవసరమే.
దీనిని ఎవరూ తప్పుబట్టలేదు. చంద్రబాబు కూడా వీటిని వద్దని చెప్పలేదు. ఇలాంటి సమయంలో.. చంద్రబాబును అసలు కుప్పంలోకి కూడా రాకుండా అడ్డుకోవలని నిర్ణయించడం.. అలజడి సృష్టించడం ..అన్నక్యాంటీన్ను ధ్వంసం చేయడం.. వంటి పరిణామాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది.. వైసీపీలో నే చర్చకు వస్తోంది. ఇంతగా అభివృధ్దికార్యక్రమాలు చేస్తూ.. కూడా ఇలా నిలువరించడం అంటే.. వైసీపీ లో ఏదైనా జంకు తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా వైసీపీ అనుసరించిన విధానంపై విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on August 28, 2022 1:22 pm
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…