ఏపీలో ఇటీవల ఒక సంస్కృతి వెలుగు చూసింది. ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే సభలు సమావేశాలకు ప్రజలు రావడం లేదు. కారణం ఏదైనా కావొచ్చు. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడం.. లేదా.. సరైన సౌకర్యాలు లేకపోవడం.. లేదా.. ఆరోజు ప్రజలకు ముఖ్యమైన పనులు ఉండడం వంటివి ఇలా..ఏవైనా కావొచ్చు. దీంతో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే సభకు జనం తగ్గిపోతున్నారు. దీంతో ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలను అధికారులు ఇలాంటి సభలకు తరలిస్తున్నారు.
ఇప్పటికి అనేక సందర్భాల్లో డ్వాక్రా మహిళలను అధికారులు తరలించడం.. ఈ క్రమంలో వారిని బెదిరించడం.. వీటికి సంబంధించిన వీడియోలు.. ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఇవివివాదానికి కూడా దారి తీశాయి. అయితే.. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు కూడా పాకిందనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా .. ఒకింత ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చకు దారితీస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్సాప్లో సందేశాలు పంపడం వివాదాస్పదమైంది.
‘కొంగర దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. డ్వాక్రా మహిళలందరూ కేసీఆర్కు స్వాగతం పలకాలి. ఉద యం 11 గంటలకల్లా మునిసిపల్ ఆఫీసు దగ్గరికి రావాలి. రాని వారి పేర్లు నమోదు చేసుకొంటాం. వాళ్లకు భవిష్యత్తులో లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వరు’ అని డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్లాయి. అంతేకాదు.. సభకు రాలేని వాళ్లు రూ.500 ఫైన్ కట్టాలని మరో మెసేజ్ పంపారు. సమావేశానికి వెళ్లలేని కొందరు మహిళలు తమ గ్రూప్ లీడర్లకు ఫైన్ కట్టినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై అధికార పార్టీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on August 28, 2022 8:49 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…