ఏపీ సీఎం జగన్ పేరు ఎత్తకుండానే.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పలు విమర్శలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని… ప్రతిసందర్భంలోను తాను మరింత ధృడంగా తయారయ్యానని అన్నారు. పల్లెటూరు జీవితం నుంచి సుప్రీం కోర్టు దాకా తన జీవన ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డారో వివరించే ప్రయత్నంలో… పరోక్షంగా జగన్ ప్రభుత్వ చర్యలను ప్రస్తావించారు.
తన కుంటుంబం విశ్వసనీయతపై దాడి చేశారని.. ఆ దాడిని తాను, తన కుటుంబం మౌనంగానే భరించామని ఆయన అన్నారు. చివరికి సత్యమే గెలిచిందంటూ ‘సత్యమేవ జయతే’ అన్నారు. జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు అమరావతి వద్ద ముందస్తు సమాచారంతో భూములు కొని లబ్ది పొందాయని నేరుగా సుప్రీం కోర్టుకే జగన్ ప్రభుత్వం రాసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను ప్రస్తావించారు. “ఒక వ్యక్తి వ్యక్తిత్వం సకల సౌకర్యాలు ఉన్నపుడు కాదని.. కష్టాలు, సవాళ్ళు ఎదురైనపుడు ఎక్కడ నిలబడ్డాడనే అంశం తెలుపుతుంద“ని అన్నారు.
తాను ఏదైనా సాధించానంటే… అది ఎంతో కష్టపడటం… సవాళ్ళను ఎదుర్కోవడం…పోరాటం చేశాకే తనకు దక్కిందేనని జస్టిస్ రమణ అన్నారు. ఎవరైనా సరే.. ఉన్నతస్థానానికి చేరుకోవాలంటే.. కష్టపడాలని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో ఏదీ ఊరికేనే రాదన్న ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొంటేనే ఎంచుకున్న రంగంలో విజయవంతంగా నిలబడతారని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తులు వస్తారు, వెళతారు కానీ సుప్రీంకోర్టు శాశ్వతం. ప్రతిఒక్కరూ ఈ వ్యవస్థకు ఎంతో కొంత తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఈ విషయంలో నా శాయశక్తులా కృషిచేశాను. అని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on August 27, 2022 6:05 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…