ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఊరట ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచార ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి రోజు వారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
తన బదులు తన తరఫు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరి అని భావించినప్పుడు.. పిలిస్తే మాత్రం కోర్టుకు వెళ్లాల్సిందేనని.. అప్పుడు ఈ మినహాయింపులు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అవినీతికి పాల్పడ్డారని.. ఆయా కంపెనీల నుంచి దొడ్డిదారిలో పెట్టు బడులు పెట్టించుకుని అనుచిత లబ్ధి పొందారని.. జగన్పై కేసులు ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసుల విచారణలో భాగంగానే 2013-15 మధ్య ప్రాంతంలో జగన్ను అరెస్టు చేయడం.. 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తర్వాత.. బెయిల్ లబించింది. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ బెయిల్ పై పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి. అయితే.. ఈ కేసుల విచారణ మాత్రం హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. దీనిని అప్పట్లో అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇక, 2019లో గెలిచి… అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. కానీ, ఆయన తనకు బదులు.. తనతరపున న్యాయవాదిని విచారణకు పంపుతున్నారు. దీనిపై సీబీఐ ఏడాది నుంచి పోరాడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే సీఎం జగన్ విచారణకు డుమ్మా కొడుతున్నారని.. ఆయనను విచారణకు రప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని.. కోర్టును కోరుతోంది. దీనిపై కూడా నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ జరిపి.. కొన్నాళ్ల కిందట.. సీఎం జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో జగన్ సవాల్ చేశారు.
This post was last modified on August 26, 2022 10:32 pm
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…