Political News

పిలిచిన‌ప్పుడు రండి: జ‌గ‌న్‌కు హైకోర్టు ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అక్ర‌మాస్తుల కేసులో.. తెలంగాణ హైకోర్టు  ఊరట ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచార ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్న‌ట్టు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి రోజు వారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

తన బదులు తన తరఫు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరి అని భావించినప్పుడు.. పిలిస్తే మాత్రం కోర్టుకు వెళ్లాల్సిందేన‌ని.. అప్పుడు ఈ మినహాయింపులు వ‌ర్తించ‌వ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉమ్మ‌డిరాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. ఆయా కంపెనీల నుంచి దొడ్డిదారిలో పెట్టు బ‌డులు పెట్టించుకుని అనుచిత ల‌బ్ధి పొందార‌ని.. జ‌గ‌న్‌పై కేసులు ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ కేసుల విచార‌ణ‌లో భాగంగానే 2013-15 మ‌ధ్య ప్రాంతంలో జ‌గ‌న్‌ను అరెస్టు చేయ‌డం.. 16 నెల‌ల పాటు ఆయ‌న జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. బెయిల్ ల‌బించింది. ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్ బెయిల్ పై పాల‌న సాగిస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి. అయితే.. ఈ కేసుల విచార‌ణ మాత్రం హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి కోర్టులో కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌తి శుక్ర‌వారం ఆయ‌న నాంప‌ల్లి కోర్టుకు హాజ‌ర‌య్యారు. దీనిని అప్ప‌ట్లో అధికార పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

ఇక‌, 2019లో గెలిచి… అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ కేసుల విచార‌ణ కొన‌సాగుతోంది. కానీ, ఆయ‌న త‌న‌కు బ‌దులు.. త‌న‌త‌ర‌పున న్యాయ‌వాదిని విచార‌ణ‌కు పంపుతున్నారు. దీనిపై సీబీఐ ఏడాది నుంచి పోరాడుతోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే సీఎం జ‌గ‌న్ విచార‌ణ‌కు డుమ్మా కొడుతున్నార‌ని.. ఆయ‌న‌ను విచార‌ణ‌కు ర‌ప్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని.. కోర్టును కోరుతోంది. దీనిపై కూడా నాంప‌ల్లి సీబీఐ కోర్టు విచార‌ణ జ‌రిపి.. కొన్నాళ్ల కింద‌ట‌.. సీఎం జ‌గ‌న్‌ విచార‌ణకు హాజ‌రు కావాల్సిందేన‌ని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో జగ‌న్ స‌వాల్ చేశారు.

This post was last modified on August 26, 2022 10:32 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

45 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

52 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago