Political News

ఆర్థిక ఎమ‌ర్జెన్సీ దిశ‌గా ఏపీ.. కాగ్ వార్నింగ్‌

ఏపీ అప్పులపై కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. కాగ్ మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాష్ట్రంలో అప్పుల పరంపర అలాగే కొనసాగుతోంద‌ని తెలిపింది. రెవెన్యూ లోటు పెరుగుతూనే ఉందని పేర్కొంది. ఇదే కొన‌సాగితే..రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

ఏడాది మొత్తానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు లెక్కించారో, అది కేవలం 2 నెలల్లోనే మించిపోయిందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.17,036.15 కోట్లకు రెవెన్యూ లోటును సరిపెడతామని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారని,  చట్టసభలకు  కూడా హామీ ఇచ్చార‌ని తెలిపింది.

కానీ, ఆ అంచనా కేవలం 2 నెలల్లోనే తప్పింద‌ని ప్ర‌భుత్వ తీరును పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌, మే నెలాఖరువరకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ రాబడికన్నా రెవెన్యూ ఖర్చు రూ.17,036.15 కోట్లు ఉంటుందని లెక్కిస్తే ఈ 2 నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.21,924.85 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే అంచనాతో పోలిస్తే ఇప్పటికే 128 శాతం రెవెన్యూ లోటు ఉందని పేర్కొంది.

ఏ రాష్ట్రంలోనైనా, ఏ కుటుంబంలోనైనా రాబడి ఎక్కువ ఉండి అందులో అప్పులు కొద్ది శాతానికి పరిమితం కావాలని కాగ్ వివ‌రించింది. అలాంటిది ప్రస్తుతం ఏపీలో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాబడిని మించి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అన్ని రకాల ఆదాయాలు కలిసి రూ.17,975.28 కోట్లు వచ్చిందని, అదే సమయంలో రూ.22,960.96 కోట్లు అప్పు తీసుకున్నారని నివేదిక స్పష్టం చేసింది.

ఆ రెండు కలిపి మొత్తం రూ.39,900 కోట్లు ఖర్చు చేశారని వివ‌రించింది. అదే సమయంలో మూలధన వ్యయమంటే ఆస్తులు సృష్టించేందుకు చేసిన ఖర్చు రూ.996 కోట్లు మాత్రమేన‌ని కాగ్ గ‌ణాంకాల రూపంలో వివ‌రించింది. దీనిని బ‌ట్టి రాష్ట్రం మ‌రిన్ని అప్పులు చేసే దిశ‌గా అడుగులు వేస్తే.. ఆర్థిక ఎమ‌ర్జెన్సీ దిశ‌గా సాగిన‌ట్టేన‌ని కాగ్ హెచ్చ‌రించ‌డంగ‌మ‌నార్హం.

This post was last modified on August 26, 2022 6:34 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

56 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago