Political News

ఆర్థిక ఎమ‌ర్జెన్సీ దిశ‌గా ఏపీ.. కాగ్ వార్నింగ్‌

ఏపీ అప్పులపై కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. కాగ్ మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాష్ట్రంలో అప్పుల పరంపర అలాగే కొనసాగుతోంద‌ని తెలిపింది. రెవెన్యూ లోటు పెరుగుతూనే ఉందని పేర్కొంది. ఇదే కొన‌సాగితే..రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

ఏడాది మొత్తానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు లెక్కించారో, అది కేవలం 2 నెలల్లోనే మించిపోయిందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.17,036.15 కోట్లకు రెవెన్యూ లోటును సరిపెడతామని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారని,  చట్టసభలకు  కూడా హామీ ఇచ్చార‌ని తెలిపింది.

కానీ, ఆ అంచనా కేవలం 2 నెలల్లోనే తప్పింద‌ని ప్ర‌భుత్వ తీరును పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌, మే నెలాఖరువరకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ రాబడికన్నా రెవెన్యూ ఖర్చు రూ.17,036.15 కోట్లు ఉంటుందని లెక్కిస్తే ఈ 2 నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.21,924.85 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే అంచనాతో పోలిస్తే ఇప్పటికే 128 శాతం రెవెన్యూ లోటు ఉందని పేర్కొంది.

ఏ రాష్ట్రంలోనైనా, ఏ కుటుంబంలోనైనా రాబడి ఎక్కువ ఉండి అందులో అప్పులు కొద్ది శాతానికి పరిమితం కావాలని కాగ్ వివ‌రించింది. అలాంటిది ప్రస్తుతం ఏపీలో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాబడిని మించి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అన్ని రకాల ఆదాయాలు కలిసి రూ.17,975.28 కోట్లు వచ్చిందని, అదే సమయంలో రూ.22,960.96 కోట్లు అప్పు తీసుకున్నారని నివేదిక స్పష్టం చేసింది.

ఆ రెండు కలిపి మొత్తం రూ.39,900 కోట్లు ఖర్చు చేశారని వివ‌రించింది. అదే సమయంలో మూలధన వ్యయమంటే ఆస్తులు సృష్టించేందుకు చేసిన ఖర్చు రూ.996 కోట్లు మాత్రమేన‌ని కాగ్ గ‌ణాంకాల రూపంలో వివ‌రించింది. దీనిని బ‌ట్టి రాష్ట్రం మ‌రిన్ని అప్పులు చేసే దిశ‌గా అడుగులు వేస్తే.. ఆర్థిక ఎమ‌ర్జెన్సీ దిశ‌గా సాగిన‌ట్టేన‌ని కాగ్ హెచ్చ‌రించ‌డంగ‌మ‌నార్హం.

This post was last modified on August 26, 2022 6:34 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago