Political News

ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యే: వైసీపీలో చ‌ర్చ‌

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌కుకంటిపై కునుకు ఉండ‌డం లేదా?  ముఖ్యంగా ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా మారిందా? ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని నాయ‌కులు క‌ల‌వ‌రం చెందుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు తొలి రెండేళ్లు క‌రోనా ఎఫెక్ట్‌తోనే స‌రిపోయింది. త‌ర్వాత‌.. అంతో ఇంతో బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఆర్థిక స‌మ‌స్య‌లు వారిని వెంటాడాయి. ఇంతలో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వ‌లంటీర్ల కార‌ణంగా..వారిని ప‌ట్టించుకున్న ప‌రిస్థితిలేదు.

అయితే.. ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని.. వారికి మాత్ర‌మే టికెట్లు ఇస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ స్ఫ‌ష్టం చేశారు. కానీ, చాలా మంది నాయ‌కులు.. చేతిలో నిధులులేవు.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్తే.. వారికి ఏం చెప్పాలి.. వారు కోరిన విధంగా చేయాలంటే.. చేతిలో డ‌బ్బులు ఉండాలి క‌దా? అని చెబుతున్నారు. దీంతో స‌గం మంది ఎమ్మెల్యేలు.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం లేదు. మ‌రికొంద‌రు మాత్రం ఇంకా స‌మ‌యం ఉంది క‌దా.. అనే ధోర‌ణిలో ఉన్నారు. ఈ ప‌రిణామాలు.. పార్టీలో ఇప్పుడు క‌ల‌వ‌రం రేపుతున్నాయి.

ఎవ‌రైతే.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేదో వారికి చెక్ పెట్టేదిశ‌గా పార్టీ అధిష్టానం చ‌ర్య‌లకు దిగుతోంది. మ‌రోవైపు.. పార్టీలో ఇప్పుడు.. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప‌రిణామం.. మ‌రింత క‌ల‌వ‌ర పెడుతోంది. ఇక్క‌డ వివాద‌స్ప‌దంగా మారార‌నే కార‌ణంగా ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి అధిష్టానం చెక్ పెట్టింది. స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద‌రావును నియ‌మించింది. ఈ ప‌రిణామం.. ఇత‌ర ఎమ్మెల్యేల్లో తీవ్ర‌స్థాయిలో గుబులు రేపుతోంది.

స్థానికంగా వివాదాల‌తో న‌డుస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎంపీల‌తో ప‌డ‌క‌పోవ‌డం.. అధికారుల‌తో విభేదాలు.. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు.. వివాదంగానే ఉన్నారు. ఇప్పుడు వీరికి కూడా చెక్ పెడితే ప‌రిస్థితి ఏంట‌ని వారు త‌ల్ల‌డిల్లుతున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం త‌మ‌కు నాయ‌కులు ప్ర‌ధానం కాద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాత్ర‌మే ప్ర‌ధాన‌మ‌నే సంకేతాల‌ను స్ప‌ష్టంగా పంపేసింది. దీంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలే. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌తో మమేకం కావ‌డం అనే రెండు ప‌ట్టాల‌పైనే వారు ప్ర‌యాణించాల్సి ఉంది.. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on August 26, 2022 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ చరణ్ సినిమా టైంలో పంచాయితీలెందుకు?

ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…

17 minutes ago

లెజెండ్‌ను ఇలాగే కదా గౌరవించాల్సింది

తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…

57 minutes ago

కోలీవుడ్ తుఫాను టాలీవుడ్డుకు పాకుతుందా

తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…

1 hour ago

పెద్ది విధ్వంసానికి ఆకాశ‌మే హ‌ద్దు

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సంద‌డితో ఎంతో ఆశాజన‌కంగా మొద‌లైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ త‌ర్వాత ఎంత వెల‌వెల‌బోయిందో తెలిసిందే.…

2 hours ago

మారుమోగుతున్న ఏపీ సర్కారీ బడుల సత్తా

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…

3 hours ago

పవన్‌కు నాని ఎప్పుడూ మద్దతే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…

3 hours ago