ఏపీ అధికార పార్టీ నేతలకుకంటిపై కునుకు ఉండడం లేదా? ముఖ్యంగా ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందా? ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాయకులు కలవరం చెందుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు తొలి రెండేళ్లు కరోనా ఎఫెక్ట్తోనే సరిపోయింది. తర్వాత.. అంతో ఇంతో బయటకు వచ్చినా.. ఆర్థిక సమస్యలు వారిని వెంటాడాయి. ఇంతలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల కారణంగా..వారిని పట్టించుకున్న పరిస్థితిలేదు.
అయితే.. ప్రజల్లోనే ఉండాలని.. వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్ఫష్టం చేశారు. కానీ, చాలా మంది నాయకులు.. చేతిలో నిధులులేవు.. ప్రజల మధ్యకువెళ్తే.. వారికి ఏం చెప్పాలి.. వారు కోరిన విధంగా చేయాలంటే.. చేతిలో డబ్బులు ఉండాలి కదా? అని చెబుతున్నారు. దీంతో సగం మంది ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. మరికొందరు మాత్రం ఇంకా సమయం ఉంది కదా.. అనే ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామాలు.. పార్టీలో ఇప్పుడు కలవరం రేపుతున్నాయి.
ఎవరైతే.. గడపగడపకు కార్యక్రమానికి హాజరు కావడం లేదో వారికి చెక్ పెట్టేదిశగా పార్టీ అధిష్టానం చర్యలకు దిగుతోంది. మరోవైపు.. పార్టీలో ఇప్పుడు.. తాడికొండ నియోజకవర్గంలో జరిగిన పరిణామం.. మరింత కలవర పెడుతోంది. ఇక్కడ వివాదస్పదంగా మారారనే కారణంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అధిష్టానం చెక్ పెట్టింది. సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావును నియమించింది. ఈ పరిణామం.. ఇతర ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో గుబులు రేపుతోంది.
స్థానికంగా వివాదాలతో నడుస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎంపీలతో పడకపోవడం.. అధికారులతో విభేదాలు.. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు.. వివాదంగానే ఉన్నారు. ఇప్పుడు వీరికి కూడా చెక్ పెడితే పరిస్థితి ఏంటని వారు తల్లడిల్లుతున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం తమకు నాయకులు ప్రధానం కాదని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రమే ప్రధానమనే సంకేతాలను స్పష్టంగా పంపేసింది. దీంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలే. వివాదాలకు దూరంగా ఉండడం.. ప్రజలతో మమేకం కావడం అనే రెండు పట్టాలపైనే వారు ప్రయాణించాల్సి ఉంది.. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 26, 2022 11:32 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…