ఏపీ అధికార పార్టీ నేతలకుకంటిపై కునుకు ఉండడం లేదా? ముఖ్యంగా ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందా? ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాయకులు కలవరం చెందుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు తొలి రెండేళ్లు కరోనా ఎఫెక్ట్తోనే సరిపోయింది. తర్వాత.. అంతో ఇంతో బయటకు వచ్చినా.. ఆర్థిక సమస్యలు వారిని వెంటాడాయి. ఇంతలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల కారణంగా..వారిని పట్టించుకున్న పరిస్థితిలేదు.
అయితే.. ప్రజల్లోనే ఉండాలని.. వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్ఫష్టం చేశారు. కానీ, చాలా మంది నాయకులు.. చేతిలో నిధులులేవు.. ప్రజల మధ్యకువెళ్తే.. వారికి ఏం చెప్పాలి.. వారు కోరిన విధంగా చేయాలంటే.. చేతిలో డబ్బులు ఉండాలి కదా? అని చెబుతున్నారు. దీంతో సగం మంది ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. మరికొందరు మాత్రం ఇంకా సమయం ఉంది కదా.. అనే ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామాలు.. పార్టీలో ఇప్పుడు కలవరం రేపుతున్నాయి.
ఎవరైతే.. గడపగడపకు కార్యక్రమానికి హాజరు కావడం లేదో వారికి చెక్ పెట్టేదిశగా పార్టీ అధిష్టానం చర్యలకు దిగుతోంది. మరోవైపు.. పార్టీలో ఇప్పుడు.. తాడికొండ నియోజకవర్గంలో జరిగిన పరిణామం.. మరింత కలవర పెడుతోంది. ఇక్కడ వివాదస్పదంగా మారారనే కారణంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అధిష్టానం చెక్ పెట్టింది. సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావును నియమించింది. ఈ పరిణామం.. ఇతర ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో గుబులు రేపుతోంది.
స్థానికంగా వివాదాలతో నడుస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎంపీలతో పడకపోవడం.. అధికారులతో విభేదాలు.. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు.. వివాదంగానే ఉన్నారు. ఇప్పుడు వీరికి కూడా చెక్ పెడితే పరిస్థితి ఏంటని వారు తల్లడిల్లుతున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం తమకు నాయకులు ప్రధానం కాదని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రమే ప్రధానమనే సంకేతాలను స్పష్టంగా పంపేసింది. దీంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలే. వివాదాలకు దూరంగా ఉండడం.. ప్రజలతో మమేకం కావడం అనే రెండు పట్టాలపైనే వారు ప్రయాణించాల్సి ఉంది.. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 26, 2022 11:32 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…