ఏపీ అధికార పార్టీ నేతలకుకంటిపై కునుకు ఉండడం లేదా? ముఖ్యంగా ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందా? ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాయకులు కలవరం చెందుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు తొలి రెండేళ్లు కరోనా ఎఫెక్ట్తోనే సరిపోయింది. తర్వాత.. అంతో ఇంతో బయటకు వచ్చినా.. ఆర్థిక సమస్యలు వారిని వెంటాడాయి. ఇంతలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల కారణంగా..వారిని పట్టించుకున్న పరిస్థితిలేదు.
అయితే.. ప్రజల్లోనే ఉండాలని.. వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్ఫష్టం చేశారు. కానీ, చాలా మంది నాయకులు.. చేతిలో నిధులులేవు.. ప్రజల మధ్యకువెళ్తే.. వారికి ఏం చెప్పాలి.. వారు కోరిన విధంగా చేయాలంటే.. చేతిలో డబ్బులు ఉండాలి కదా? అని చెబుతున్నారు. దీంతో సగం మంది ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. మరికొందరు మాత్రం ఇంకా సమయం ఉంది కదా.. అనే ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామాలు.. పార్టీలో ఇప్పుడు కలవరం రేపుతున్నాయి.
ఎవరైతే.. గడపగడపకు కార్యక్రమానికి హాజరు కావడం లేదో వారికి చెక్ పెట్టేదిశగా పార్టీ అధిష్టానం చర్యలకు దిగుతోంది. మరోవైపు.. పార్టీలో ఇప్పుడు.. తాడికొండ నియోజకవర్గంలో జరిగిన పరిణామం.. మరింత కలవర పెడుతోంది. ఇక్కడ వివాదస్పదంగా మారారనే కారణంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అధిష్టానం చెక్ పెట్టింది. సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావును నియమించింది. ఈ పరిణామం.. ఇతర ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయిలో గుబులు రేపుతోంది.
స్థానికంగా వివాదాలతో నడుస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎంపీలతో పడకపోవడం.. అధికారులతో విభేదాలు.. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు.. వివాదంగానే ఉన్నారు. ఇప్పుడు వీరికి కూడా చెక్ పెడితే పరిస్థితి ఏంటని వారు తల్లడిల్లుతున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం తమకు నాయకులు ప్రధానం కాదని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రమే ప్రధానమనే సంకేతాలను స్పష్టంగా పంపేసింది. దీంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలే. వివాదాలకు దూరంగా ఉండడం.. ప్రజలతో మమేకం కావడం అనే రెండు పట్టాలపైనే వారు ప్రయాణించాల్సి ఉంది.. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 26, 2022 11:32 am
కల్కి, సలార్ లాంటి భారీ విజయాలు ఖాతాలో ఉన్నా కూడా, ప్రభాస్ వాటి సీక్వెల్స్ ను హోల్డ్ లో పెట్టి…
ప్రశాంత్ నీల్ అనగానే భారీ బ్లాస్ట్ లు, తుపాకుల మోతలు, డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే రక్తపాతం గుర్తొస్తాయి.…
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయికల్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్న…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ…
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మెగా 158' ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం.…