టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. దీనిపై అధికార పార్టీ వైసీపీ నుంచిసూటి పోటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యారని.. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేదని.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ను ఎట్టి పరిస్థితిలోనూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కించి.. అసెంబ్లీకి పంపించాలనే లక్ష్యం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ విషయంపై … పార్టీ అధినేత చంద్రబాబు కూడా మెగా ఆలోచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యం గా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాజధాని ఏర్పాటు చేసిన కారణంగా.. మంగళగిరి నియో జకవర్గం అయితే.. బాగుంటుందని.. ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని.. పార్టీ నాయకులు భా వించారు. దీనిపై మరో మాట లేకుండా.. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. లోకేష్ ఇక్కడ పరాజయం పొందారు. దాదాపు 5 వేల ఓట్ల తేడాతో విజయానికి ఆయన దూరమయ్యారు.
దీంతో మరో నియోజకవర్గం కోసం.. పార్టీ అధినేత ప్రయత్నాలు చేశారనే వాదన వినిపించింది. కానీ, లోకేష్ మాత్రం మంగళగిరికే పరిమితం అవ్వాలని.. ఓడిన చోటే గెలిచి.. వైసీపీకి లెస్సన్ చెప్పాలని.. ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు అనుకున్న విధంగా మంగళగిరి టీడీపీ రాజకీయాలు లేవు.
కీలకమైన నాయకులు.. పార్టీ నుంచి దూరమయ్యారు. దీంతో ఇప్పుడు లోకేష్కు అండగా నిలిచేవారు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు.. లేకుండా పోయారు. దీంతో చంద్రబాబు మరో ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారని.. పార్టీలో చర్చసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ను మరో నియోజకవర్గం నుంచి కూడా ఏకకాలంలో పోటీ చేయించాలని.. ఆయన భావిస్తున్నారట. మంగళగిరి సహా.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట లేదా.. ఉండి నియోజకవర్గాల నుంచి ఇవి కాకపోతే.. విశాఖలోని గాజువాక… విశాఖ తూర్పుల నుంచి కానీ.. లోకేష్ను పోటీ చేయించాలని.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం.
దీనిని బట్టి.. ఖచ్చితంగా లోకేష్ అసెంబ్లీలో అడుగు పెట్టేలా.. చంద్రబాబు అడుగులు పడుతున్నాయని పార్టీఆ సీనియర్లు చెబుతున్నారు. రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ద్వారా.. ఎక్కడో ఒక చోట ఆయన గెలుపు ఖాయమని.. పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. మరిఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో.. చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నాయకుడిగా.. లోకేష్ రికార్డు సృష్టించడం ఖాయం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…