Political News

ఇక చంద్ర‌బాబుపై ఈగ వాల‌దు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఆయ‌నపై ఈగ వాల‌కుండా చూసుకునేందుకు స‌మాయ‌త్త‌మైంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే.. తాజాగా కుప్పంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. త‌న ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నాయ‌కులు నిలువ‌రించ‌డం.. త‌న కాన్వాయ్ ల‌క్ష్యంగా.. రాళ్ల దాడి చేయ‌డం.. వంటివిష‌యాల‌ను ఆయ‌న చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి కూడా అంతే వేగంగా రియాక్ష‌న్ వ‌చ్చింది. నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ను కేంద్ర ప్ర‌భుత్వం హుటాహుటిన రంగంలోకి దింపింది. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన డీఐజీ.. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ఆఫీసులోని ప్రతి రూమ్ ను ఎన్ఎస్‌జీ బృందం తో ఆయ‌న త‌నిఖీలు చేశారు. అదేస‌మ‌యంలో స్థానికంగా ఉన్న డీఎస్పీతోనూ.. ఎన్ ఎస్‌జీ డీఐజీ భేటీ అయ్యారు.

చంద్ర‌బాబుకు సివిల్ పోలీసుల నుంచి అందుతున్న భ‌ద్ర‌త‌.. ఆయ‌న ఎక్క‌డికైనా వెళ్తే.. అనుస‌రిస్తున్న కాన్వాయ్‌లో ఉంటున్న పోలీసులు.. ఇలా.. అన్ని విష‌యాల‌ను ఆరా తీసిన‌ట్టు టీడీపీ కార్యాల‌య అధికారులు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిర్లక్ష్యంపై చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి టీడీపీ ఫిర్యాదులు చేసిన నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు.. చంద్ర‌బాబుకు.. టీడీపీ నేత‌ల‌కు ఊర‌ట‌నిస్తున్నాయి.

This post was last modified on August 26, 2022 9:45 am

Share

Recent Posts

కొత్త మెట్లు ఎక్కేసిన కిరణ్ అబ్బవరం

కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…

3 hours ago

తూచ్.. మల్లారెడ్డి పార్టీ మారట్లేదు!

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…

4 hours ago

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

4 hours ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

5 hours ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

6 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

7 hours ago