బీజేపీ జాతీయ పార్టీ. ఒక సిద్ధాంతం ప్రకారం.. పనిచేయాల్సిన పార్టీ. అదేసిద్ధాంతంతో ఎదగాల్సిన పార్టీ. 1983లో ఏర్పడిన ఈపార్టీ అవే సిద్ధాంతాల పునాదులపై ముందుకు సాగింది. చాలా మంది నాయకులు పార్టీని ముందుకు నడిపించారు. అయితే.. ఎవరూ ఎప్పుడూ.. పొరుగు పార్టీని తమలో కలిపేసుకుని.. ముందుకు వెళ్లాలని అనుకోలేదు. అసలు ఇది .. జాతీయ పార్టీగా.. బీజేపీకి సరైన విధానం కూడా కాదు. అయితే.. ఇటీవల కాలంలో బీజేపీ ఇదే పంథాను అనుసరిస్తోంది.
ఇతర పార్టీలను బలహీనపరిచి.. తమ లో విలీనం చేసుకుని.. ప్రభుత్వాలను కూలదోస్తోంది. ఇప్పుడు.. తాజాగా ఇదే విషయాన్ని ఎంపీ అర్వింద్ ముసుగు తీసినట్టు వివరించారు. బీజేపీ ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ అన్నారు. బెజవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకు న్నారు. అనంతరం .. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ మేలి ముసుగును తీసేశారు.
రాజకీయాల్లో ఒకపార్టీ ఎదగడానికి మరో పార్టీని చీల్చటంలో తప్పులేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో తమ పార్టీ బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీలోనూ అధికారంలోకి వస్తామన్నారు.
విజయవాడతో తనకున్న అనుబంధాన్ని అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఈడీ, సీబీఐలను బీజేపీ పావులుగా వాడుకుంటుందా ? అన్న ప్రశ్నకు.. అదేం లేదని సమాధానమిచ్చారు. బీజేపీ అధినాయకత్వం ఏం చెబితే తాము అది పాటిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలను బీజేపీ అమ్మటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్న మరో ప్రశ్నకు.. ప్రాంతీయ పార్టీలు చేసినవే తాము చేస్తున్నామని అరవింద్ బదులిచ్చారు. బీజేపీ ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని మరోసారి చెప్పుకొచ్చారు. ఎంపీ వ్యాఖ్యలతో.. అందరూ ఔరా అని నోరెళ్లబెట్టక తప్పలేదు.
This post was last modified on August 25, 2022 11:34 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…