Political News

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి.. ఆ నలుగురిలో ఒకరు

హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలు.. ప్రధాన రాజకీయ పార్టీలకు పెను పరీక్షగా మారిన వైనం తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్లిపోవటంతో.. ఆ పార్టీకి అభ్యర్థి సమస్య లేదన్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో.. సరైన అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. ఇదిలా ఉంటే.. అసలీ ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హ్యాండ్ తో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

ఈ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి అనివార్యం కావటంతో.. తగిన అభ్యర్థిని బరిలోకి దించటం కోసం భారీ ఎత్తున కసరత్తు సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పలువురి అభ్యర్థిత్వాలపై చర్చ సాగిన తర్వాత.. మొత్తం నలుగురు అభ్యర్థుల్ని ఫైనల్ లిస్టుగా తయారు చేశారు. వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇంతకూ ఆ నలుగురు ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తకరంగా మారింది.

మనుగోడు ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ అధిష్ఠానం సైతం కన్నేయటం.. రేవంత్ మీద గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిచిన గాంధీ కుటుంబం.. ఆయనతో ప్రియాంక ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు సెంట్రిక్ గా వారి చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలో కోమటిరెడ్డి ఆలోచనలకు సైతం పెద్ద పీట వేస్తారన్న మాట వినిపిస్తోంది.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా నలుగురు ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పాల్వాయి స్రవంతి.. క్రిష్ణారెడ్డి.. పల్లె రవి.. కైలాష్ నేత ఉన్నారు. అభ్యర్థుల బలాబలాలు.. వారికున్న గెలుపు అవకాశాలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు అధిష్ఠానానికి రిపోర్టు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ నలుగురిలో ఒకరిని అధికారికంగా అభ్యర్థిగా డిసైడ్ చేసి ప్రకటిస్తారని చెబుతున్నారు.

This post was last modified on August 25, 2022 7:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

59 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago