ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. వైసీపీలో ఉన్నంత మంది స్వామి భక్తులు ఇతర పార్టీలో మనకు కనిపిం చడం లేదు. అదా.. ఇదా.. అనే తేడా లేదు. ఎవరో చూస్తారు.. ఏదో అంటారు. కలడో లేడో అనే సంశయం లేకుండా.. అధినేత మనసు మెప్పించేలా.. నాయకులు.. వేస్తున్న కలర్స్ అన్నీ ఇన్నీ కావు. సృష్టి ఆది యందు అన్నట్టుగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తనంతట తనే పాఠశాలలు, పంచాయతీ ఆఫీసులకు పార్టీ రంగులు పూసేసింది.
అయితే.. నీవు నేర్పిన విద్యయే.. అంటూ.. అధికారంలో ఉన్న పెద్దల ఆశీస్సుల కోసం.. మిక్కిలి వగరుస్తున్న వైసీపీ నాయకులు.. అందివచ్చిన ప్రతి దానికీ.. పార్టీ రంగులు పూసేస్తూస్తున్నారు. కొన్ని రోజుల కిందట.. వైసీపీ నాయకుడు ఒకరు.. ప్రకాశం జిల్లాలో చనిపోయారు. అంతిమ యాత్రలో ఆయనకు కట్టిన పాడి కూడా.. వైసీపీ రంగులు పూసిన కర్రలతోనే కట్టారు.
ఇది చూసిన.. పార్టీ పెద్దలు.. మెచ్చుకున్నారో.. ఈ పని చేసిన సదరు నాయకుడికి.. లేదో తెలియదు కానీ.. దీనిపై భారీ ఎత్తున విమర్శలైతే వచ్చాయి. కట్ చేస్తే.. ఇప్పుడు మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో వినాయక ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు. మరి .. వైసీపీ నేతలు.. దీనిని మాత్రం వదిలి పెడతారా? ఇదిగో.. ఈ ఫొటో చూశారుగా.. ఇది వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఏర్పాటు చేసేందుకు.. ఓ ఎమ్మెల్యే రూపొందించిన వినాయక విగ్రహం.
వినాయకుడికి.. కూడా వైసీపీ రంగులు పులిమేసి.. తమ పార్టీ పిచ్చిని.. వినాయకుడికి కూడా పట్టించేసి.. ఇలా తయారు చేశారు. వినాయక చవితికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఇక, ఇది చూసిన పార్టీ నాయకులు.. టికెట్ల ఆశావహులు కూడా వినాయక విగ్రహాలను ఇలానే తయారు చేయించే పనిలో పడినా ఆశ్చర్యం లేదు. దీనిని చూసిన సగటు మానవుడు మాత్రం.. ఇది కదూ.. స్వామీ భక్తి అంటే! అంటూ.. బుగ్గలు నొక్కుకుంటున్నారు.
This post was last modified on August 25, 2022 12:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…