Political News

ప్రాజెక్టు పూర్త‌య్యాకే ఎన్నిక‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పాడంటే.. చేస్తాడంటే! అని వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతుంటారు. కానీ, ఆయ న ఎన్నో చెప్పినా.. కొన్ని మాత్ర‌మే చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే.. అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూడా సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి ఇది ఏం చేస్తారో చూడాలి. 2023 సెప్టెంబరులో వెలి గొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు.

ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్‌ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్‌ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు. గ్రానైట్‌ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని.. మళ్లీ శ్లాబ్‌ సిస్టమ్‌ విధానాన్ని తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మా విధానాల వల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయని.. కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

7 వేల యూనిట్లకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేశామని.. చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు విద్యుత్‌ ఛార్జీల్లో రూ.2 తగ్గిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు.

ఇదో స‌ర‌దా స‌న్నివేశం..

సీఎం జగన్‌ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో.. ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ.. దివంగ‌త వైఎస్పై ఓ పాట పాడారు. కొద్దిసేపు పాడిన తర్వాత.. ఇక చాలని సీఎం జగన్‌ సూచించినా ఆమె పట్టించుకోలేదు. అదే ఒరవడితో పాట కొనసాగించారు. వెంటనే తన స్థానం నుంచి లేచి వచ్చిన జగన్‌…. వెంకాయమ్మను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.

This post was last modified on August 25, 2022 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago