ఏపీ సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంటే! అని వైసీపీ నాయకులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఆయ న ఎన్నో చెప్పినా.. కొన్ని మాత్రమే చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే.. అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూడా సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మరి ఇది ఏం చేస్తారో చూడాలి. 2023 సెప్టెంబరులో వెలి గొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు.
ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు. గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని.. మళ్లీ శ్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మా విధానాల వల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయని.. కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
7 వేల యూనిట్లకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేశామని.. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల్లో రూ.2 తగ్గిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
ఇదో సరదా సన్నివేశం..
సీఎం జగన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో.. ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ.. దివంగత వైఎస్పై ఓ పాట పాడారు. కొద్దిసేపు పాడిన తర్వాత.. ఇక చాలని సీఎం జగన్ సూచించినా ఆమె పట్టించుకోలేదు. అదే ఒరవడితో పాట కొనసాగించారు. వెంటనే తన స్థానం నుంచి లేచి వచ్చిన జగన్…. వెంకాయమ్మను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.
This post was last modified on August 25, 2022 12:18 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…