ఏపీ సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంటే! అని వైసీపీ నాయకులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఆయ న ఎన్నో చెప్పినా.. కొన్ని మాత్రమే చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే.. అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూడా సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మరి ఇది ఏం చేస్తారో చూడాలి. 2023 సెప్టెంబరులో వెలి గొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు.
ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు. గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని.. మళ్లీ శ్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మా విధానాల వల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయని.. కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
7 వేల యూనిట్లకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేశామని.. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల్లో రూ.2 తగ్గిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
ఇదో సరదా సన్నివేశం..
సీఎం జగన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో.. ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ.. దివంగత వైఎస్పై ఓ పాట పాడారు. కొద్దిసేపు పాడిన తర్వాత.. ఇక చాలని సీఎం జగన్ సూచించినా ఆమె పట్టించుకోలేదు. అదే ఒరవడితో పాట కొనసాగించారు. వెంటనే తన స్థానం నుంచి లేచి వచ్చిన జగన్…. వెంకాయమ్మను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.
This post was last modified on August 25, 2022 12:18 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…