Political News

వైసీపీ వ్యూహాలు అంతుచిక్కడం లేదే

వైసీపీ అధిష్టానం చేస్తున్న చ‌ర్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి. ఎస్సీలకు అండ‌గా ఉంటామ‌ని ప‌దే ప‌దే చెప్పే పార్టీ.. ఇప్పుడు అదే ఎస్సీ నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్టి వినోదం చూస్తున్న‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీలో రాజకీయా లు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తున్నట్లు.. వైసీపీ అధిష్టానం ప్రకటించింది.

సాధారణంగా పార్టీకి ఎమ్మెల్యే లేని చోట్ల ఇన్‌ఛార్జ్‌లు ఉంటారు. ఇక్కడ  ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. అదనపు ఇన్‌ఛార్జ్‌గా మ‌రో ఎస్సీని నియమించడం.. రాజకీయంగా ఎస్సీల‌కు.. ఎస్సీల‌కు మ‌ధ్య చిచ్చుపెట్ట‌డమేన‌నే వాద‌న వినిపిస్తోంది. ఎస్సీల ఆత్మాభిమానంతో వైసీపీ అధిష్టానం ఆడుకుంటోందా? అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

డొక్కా నియామక ప్రకటన వెలువడగానే.. శ్రీదేవి విస్తుపోయారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు సుచరిత ఇంటి ఎదుట.. అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించి.. రాజీనామాలు చేస్తామని ప్రకటింపజేశారు. అయినా అధిష్ఠానం నుంచి స్పందన రాలేదు. దీంతో శ్రీదేవి ఇంట్లోంచి బయటకు రావడం లేదు. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆపేశారు. మరోవైపు అదనపు ఇన్‌ఛార్జ్‌గా పార్టీ పదవితో పాటు.. శాసనమండలి విప్‌గానూ డొక్కా డబుల్‌ ప్రమోషన్‌ కొట్టేశారు. గతంలో ఈ నియోజక వర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అనుభవం ఆయనకుంది.

పాత పరిచయాలుండటంతో ఒక్కసారిగా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో తిరుగుతూ నాయకుల్ని కలుస్తున్నారు. ఎవరికైనా… ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో ఓ స్పష్టత వస్తుంది. కానీ డొక్కా ని యామకం ద్వారా… ఈసారి తాడికొండ అభ్యర్థి ఆయనేనన్న సంకేతాలను పార్టీ పంపినట్లయింది. మొదట్లో శ్రీదేవికి మద్దతుగా మాట్లాడిన కొందరు వెనక్కి తగ్గారు. తాజాగా ఆమెకు మద్దతుగా మేడికొండూరులో సమా వేశం చేపట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.

అధికార పార్టీ వారినే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడంతో.. ఆమెకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవనే సంకేతాలు పంపినట్లయింది. తాజా పరిణామాలతో శ్రీదేవికి కన్నీరొక్కటే మిగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి అనూహ్యంగా ఉండవల్లి శ్రీదేవి.. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె విజయం సంచలనమే అయినప్పటికీ.. ఇప్పుడు అధిష్టానం.. ఎస్సీల‌కు ఎస్సీల‌కు మ‌ధ్య చిచ్చు పెట్ట‌డ‌మే.. చిత్రంగా ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈప‌రిణామం.. ఎటు దారితీస్తుందో చూడాలి.

This post was last modified on August 24, 2022 10:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాముడి పాట….అభిమానులు హ్యాపీనా

గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…

2 minutes ago

పిక్ ఆప్ ద డే… బాబుతో వర్మ షేక హ్యాండ్

ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…

31 minutes ago

అమెరికాలో భారత సంతతికి చెందిన కౌన్సిలర్‌పై గ్యాంబ్లింగ్ ఆరోపణలు!

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…

51 minutes ago

‘స్పిరిట్’ ఎప్పుడు – ఎక్కడ – ఎలా

ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…

2 hours ago

ఓహ్ బేబీ….ఇది రెండో నెంబర్ బ్రేకు

రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…

3 hours ago

సుప్రీం తీర్పు : గవర్నర్ ఆమోదం లేకుండానే… చట్టాలుగా 10 తమిళ బిల్లులు

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…

4 hours ago