ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు .. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడాన్ని సహించలేక పోయారు. వ్యూహాత్మకంగా.. చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ నేతలు రాళ్లదాడితో చెలరేగిపోయారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు రాష్ట్ర సరిహద్దు కొంగనపల్లెలో వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇక్కడ నుంచి చంద్రబాబు రామకుప్పం చేరుకోవాల్సి ఉంది. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో ఆయన ప్రసంగించాలి.
అయితే.. చంద్రబాబు పర్యటించే రూట్ ముందుగానే తెలుసుకున్న వైసీపీ నాయకులు కొందరు.. ఆయనను అడ్డగించే ప్రయత్నం చేశారు. రామకుప్పం మండలం కొల్లుపల్లి వద్ద.. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు, తోరణాలు కట్టారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఫలితంగా ఇరుపార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఇందులో బోదుగూరు ఎస్సైకి, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఇంతలోనే అక్కడకు కాన్వాయ్ చేరుకుంది. మరికొందరు వైసీపీ కార్యకర్తలు.. కాన్వాయ్పై కూడా రాళ్లు వేసే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు అప్రమత్తమై.. వారిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే.. సభాస్థలికి చేరుకున్న చంద్రబాబు వైసీపీ సర్కారుపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ సర్కారు ఎన్ని రోజులు ఉంటుందో వారికే తెలియదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలను ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పింఛన్లు తొలగించలేదని చంద్రబాబు చెప్పారు. గండికోట జలాశయం ద్వారా పులివెందు లకు నీళ్లు తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వైసీపీ నేతలకు కుప్పం నియోజకవర్గం అంటే కక్ష అని మండిపడ్డారు. కుప్పంలో చోటామోటా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను వస్తున్నానని ముందుగానే తెలుసుకుని.. మా కాన్వాయ్పై రాళ్ల దాడి చేసేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఇవన్నీ తెలిసి కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు. వైసీపీ నాయకులతో పోలీసులు కుమ్మక్కయ్యారు“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
This post was last modified on August 24, 2022 9:04 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…