Political News

రాజ‌కీయ మంట‌లు.. పోలీసుల మధ్య గొడవ

శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన … ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు ప‌డితే చాలు.. కొట్టుకునే ప‌రిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత‌.. అంటూ.. ఒకరిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. ఇంత‌కీ ఇది ఎక్క‌డో కాదు.. మ‌న ద‌గ్గ‌రే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒక‌రిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా స‌రిహ‌ద్దు దాటొద్దు..` అని ఒక‌రికి ఒక‌రు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కార‌ణం.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ర‌గులుతున్న రాజ‌కీయ మంట‌లే!

గ‌తంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో సాగ‌ర్ నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా జ‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన విష‌యం గుర్తుందా? ఆ స‌మ‌యంలో రాజ‌కీయంగా తెలంగాణ నాయ‌కులు ఏపీపై విరుచుకుప‌డిన విష‌యం మ‌రిచిపోలేదు క‌దా! అప్ప‌ట్లో ఇరు రాష్ట్రాల పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. ఒక సంద‌ర్భంలో ఇరు ప‌క్షాలు ఒకరిపై ఒక‌రు లాఠీచార్జీ చేసుకునే వ‌ర‌కు ఉద్రిక్త‌త‌లు చేరుకున్నాయి.

అయితే.. ఈ విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయారు. కానీ, పోలీసులు మాత్రం ఇంకా వివాదాల నుంచి బ‌య‌ట‌కు రాలేదు. రాజ‌కీయ నేత‌లు ర‌గిల్చిన మంట వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా.. అదే
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పై.. తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై  తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనం రావ‌డంతో తెలంగాణ పోలీసులు, సిబ్బంది ఆ వాహ‌నాన్ని అడ్డుకున్నారు.

తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త‌ వాతావరణం నెలకొంది.  తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ ప‌రిణామంతో రెండు రాష్ట్రాల పోలీసుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే.. ఈ ఘ‌ర్ష‌ణ‌ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. కానీ, రాజ‌కీయంగా ఏర్ప‌డిన ఈ వివాదం.. ప్ర‌స్తుతానికి స‌మ‌సిపోయింద‌ని భావిస్తున్నా.. భ‌విష్య‌త్తులో మాత్రం మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు.

This post was last modified on August 24, 2022 8:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago