Political News

రాజ‌కీయ మంట‌లు.. పోలీసుల మధ్య గొడవ

శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన … ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు ప‌డితే చాలు.. కొట్టుకునే ప‌రిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత‌.. అంటూ.. ఒకరిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. ఇంత‌కీ ఇది ఎక్క‌డో కాదు.. మ‌న ద‌గ్గ‌రే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒక‌రిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా స‌రిహ‌ద్దు దాటొద్దు..` అని ఒక‌రికి ఒక‌రు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కార‌ణం.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ర‌గులుతున్న రాజ‌కీయ మంట‌లే!

గ‌తంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో సాగ‌ర్ నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా జ‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన విష‌యం గుర్తుందా? ఆ స‌మ‌యంలో రాజ‌కీయంగా తెలంగాణ నాయ‌కులు ఏపీపై విరుచుకుప‌డిన విష‌యం మ‌రిచిపోలేదు క‌దా! అప్ప‌ట్లో ఇరు రాష్ట్రాల పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. ఒక సంద‌ర్భంలో ఇరు ప‌క్షాలు ఒకరిపై ఒక‌రు లాఠీచార్జీ చేసుకునే వ‌ర‌కు ఉద్రిక్త‌త‌లు చేరుకున్నాయి.

అయితే.. ఈ విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయారు. కానీ, పోలీసులు మాత్రం ఇంకా వివాదాల నుంచి బ‌య‌ట‌కు రాలేదు. రాజ‌కీయ నేత‌లు ర‌గిల్చిన మంట వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా.. అదే
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పై.. తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై  తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనం రావ‌డంతో తెలంగాణ పోలీసులు, సిబ్బంది ఆ వాహ‌నాన్ని అడ్డుకున్నారు.

తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త‌ వాతావరణం నెలకొంది.  తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ ప‌రిణామంతో రెండు రాష్ట్రాల పోలీసుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే.. ఈ ఘ‌ర్ష‌ణ‌ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. కానీ, రాజ‌కీయంగా ఏర్ప‌డిన ఈ వివాదం.. ప్ర‌స్తుతానికి స‌మ‌సిపోయింద‌ని భావిస్తున్నా.. భ‌విష్య‌త్తులో మాత్రం మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు.

This post was last modified on August 24, 2022 8:24 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

2 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

2 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

2 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

3 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

3 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

4 hours ago