శాంతి భద్రతలను కాపాడాల్సిన … ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు పడితే చాలు.. కొట్టుకునే పరిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత.. అంటూ.. ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా సరిహద్దు దాటొద్దు..` అని ఒకరికి ఒకరు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కారణం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న రాజకీయ మంటలే!
గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుత్ను ఉత్పత్తి చేసిన విషయం గుర్తుందా? ఆ సమయంలో రాజకీయంగా తెలంగాణ నాయకులు ఏపీపై విరుచుకుపడిన విషయం మరిచిపోలేదు కదా! అప్పట్లో ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య తీవ్ర యుద్ధం తెరమీదికి వచ్చింది. ఒక సందర్భంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు లాఠీచార్జీ చేసుకునే వరకు ఉద్రిక్తతలు చేరుకున్నాయి.
అయితే.. ఈ విషయాన్ని నేతలు మరిచిపోయారు. కానీ, పోలీసులు మాత్రం ఇంకా వివాదాల నుంచి బయటకు రాలేదు. రాజకీయ నేతలు రగిల్చిన మంట వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా.. అదే
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పై.. తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనం రావడంతో తెలంగాణ పోలీసులు, సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ పరిణామంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే.. ఈ ఘర్షణ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. కానీ, రాజకీయంగా ఏర్పడిన ఈ వివాదం.. ప్రస్తుతానికి సమసిపోయిందని భావిస్తున్నా.. భవిష్యత్తులో మాత్రం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
This post was last modified on August 24, 2022 8:24 pm
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…