Political News

డిసెంబర్ కి టార్గెట్ పూర్తయిపోతుందా ?

అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపిక దాదాపు డిసెంబర్ కల్లా పూర్తయిపోతుందని సమాచారం. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్నిచోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. అలాగే మరికొన్ని చోట్ల సమన్వయకర్తలను కూడా ప్రకటిస్తున్నారు. మామూలుగా అయితే ఎంఎల్ఏలు లేని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలుగా నేతలనో లేకపోతే ఓడిపోయిన ఎంఎల్ఏలనో నియమించటం సాధారణం.

కానీ ఇక్కడ జగన్ ఏమి చేస్తున్నారంటే ఎంఎల్ఏలున్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తల పేరుతో నేతలను నియమిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఎంఎల్ఏ శ్రీదేవి ఉన్నప్పటికీ అదనపు సమన్వయకర్తగా ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావును నియమించారు. ఈ నియామకం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తలను జగన్ నియమిస్తున్నారంటే సదరు ఎంఎల్ఏ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారనే అర్ధం.

గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం అమలవుతున్న తీరుపై జగన్ ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. దాని ఆధారంగానే ఎంఎల్ఏల పనితీరును లెక్కేస్తున్నారు. దీని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లిస్తానని గతంలోనే స్పష్టంగా అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇపుడు అదనపు సమన్వయకర్తల నియామకం ఎంఎల్ఏల పనితీరు ఆధారంగా చేస్తున్నదే. అభ్యర్ధుల ఎంపిక లేదా అదనపు సమన్వయకర్తల నియామకం అన్నది రాబోయే దసరా పండగ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేసేయాలని జగన్ టార్గెట్  గా పెట్టుకున్నట్లు సమాచారం.

ప్రతినెలా జగన్ సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరు, మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై సర్వేలు జరుగుతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  బృందం సర్వే ప్రక్రియలో బిజీగా ఉన్నది. ఐప్యాక్ టీమ్ తో పాటు ఇంటెలిజెన్స్, ఇతర మార్గాల్లో కూడా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఈ రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థులు లేదా అదనపు సమన్వయకర్తల నియామకాన్ని ఫైనల్ చేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికలకు జగన్ ఇటు ప్రభుత్వం అటు పార్టీపరంగా అన్ని విధాలుగా సిద్ధపడుతున్నట్లు అర్ధమవుతోంది.

This post was last modified on August 24, 2022 5:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

8 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago