Political News

వైసీపీకి పొంచి ఉన్న పెను ప్ర‌మాదం.. ఎలాగంటే!

ఏపీ అధికార పార్టీలో ధీమా క‌నిపిస్తోంది.తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను మ‌రోసారి గ‌ద్దెనెక్కేలా చేస్తాయ‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. మంచిదే. అయితే.. అదేస‌మ‌యంలో ఈ సంక్షేమం ఎంత‌మందికి అందుతోంది?  ఎంత మంది హ్యాపీగా ఫీల‌వుతున్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీకి డేంజర్ బెల్స్ ఎందుకు మోగుతున్నాయ‌ని అంటున్నారో.. తెలుస్తుంది. ఏపీలో మొత్తం 4.95 కోట్ల మంది జ‌నాభా ఉన్నారు.  

వీరిలో ఉద్యోగాలు చేసేవారు.. 2 కోట్ల కుటుంబాలు ఉన్నారు. ఇత‌ర చేతి వృత్తులు చేసేవారు.. 70 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న గ‌ణాంకాల మేర‌కు చెబుతున్న‌వే. సో.. వీరిలో ఎంత మందికి ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయి? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. వీరిపైనే వైసీపీ స‌ర్కారు ఆశ పెట్టుకుంది కాబ‌ట్టి!  2019లో అధికారంలోకివ‌చ్చిన వైసీపీ..అప్ప‌టి వ‌ర‌కు ఉన్న సామాజిక ఫించ‌న్ల‌ను పెంచింది. అదేస‌మ‌యంలో కొన్ని ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చింది.

అయితే.. ఈ పెంచిన ఫించ‌న్ల మాట ఎలా ఉన్నా.. వివిద కార‌ణాల‌తో.. వేల మందిని తొల‌గించింది. అదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన తోఫాలు.. కానుక‌ల‌ను ఎత్తేసింది. విదేశీ విద్యాదీవెన కార్య‌క్ర మాన్ని పూర్తిగా నిలిపి వేసింది. దీంతో ల‌బ్ధిదారుల సంఖ్య పై నా ప్ర‌భావం ప‌డింది. కేవ‌లం ప్ర‌భుత్వం నుంచి 5 వేల రూపాయ‌ల పారితోషికం అందుకుంటున్న వ‌లంటీర్ల కుటుంబాల్లోని వారికి కూడా పించ‌న్లు నిలిపివేసింది. దీంతో సంక్షేమ‌ప‌థ‌కాల నుంచి పేర్లు తొలిగిపోయిన వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు.. ఇన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు కార‌ణ‌మైన ప‌న్నులు.. క‌డుతున్న‌వారికి ప్ర‌భుత్వం ఏం మేలు చేస్తోంది? అనేది మౌలిక ప్ర‌శ్న‌. గ‌తంలో పింక్ కార్డు ఉండేది. ఇప్పుడు దానిని ఎత్తేశారు. ఇక‌, చెత్త‌ప‌న్ను.. వృత్తి ప‌న్నుల పేరుతో బాదేస్తున్నారు. పెట్రో ల్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం లేదు. ఇసుక అందుబాటులో లేదు. సిమెంటు ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో నిర్మాణ రంగం కుప్ప‌కూలింది. ఫ‌లితంగా.. దానిపై ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఆధార‌ప‌డిన ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఉపాధి లేకుండా పోయింది.

ఉద్యోగాలు లేవు.. ఉపాది లేదు. యువ‌త‌కు భ‌రోసా కూడా కుంటు పడింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ చెబుతున్న సంక్షేమ మంత్రానికి ఓట్లు రాలేదెక్క‌డ‌? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జాతీయ మీడియా ప్ర‌ముఖంగా పేర్కొంది. దీంతో ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య సంక్షేమ స‌ర్కారుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఎన్నిక‌ల స‌మయానికి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on August 24, 2022 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 hour ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

3 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

6 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

6 hours ago