Political News

జగన్.. లిక్కర్ కింగ: కేంద్ర మంత్రి

రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర‌స్థాయిలో నిప్పు లు చెరిగారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోయిందని ధ్వజమెత్తారు.

ఎన్నికలకు ముందు ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వనరుల న్నింటినీ దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయన్నారు.  

“ఏపీలో మా ప్రభుత్వం వచ్చాక అన్ని మాఫియాల ఆట కట్టిస్తాం. అవినీతిలో ఏపీది నాలుగో స్థానం, తెలంగాణది రెండో స్థానం. మోడీ ప్రభుత్వం ఏపీకి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి లేదు. ఒక్క రాజధానికే డబ్బు లేదు.. 3 రాజధానులు ఎలా కడతారు?. జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ కూడా. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారు.“ అని అనురాగ్ నిప్పులు చెరిగారు. 

This post was last modified on August 22, 2022 10:05 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

11 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

12 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

13 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

14 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

18 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

20 hours ago