తెలంగాణలో ఒక్క రోజులో మునుపటి రోజుపై 40 శాతం కేసులు పెరగడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కరోనా రోగుల సంఖ్యలో తెలంగానది ఐదో ఆరో స్థానమో కావచ్చు గాని పాజిటివిటీ రేటు అటూ చాపకింద నీరులా అది వ్యాపించిన తీరు ఘోరంగా ఉంది. టెస్టుల్లో వచ్చే పాజిటివ్ కేసుల పర్సెంటీజేలో దేశంలో తెలంగాణది నెం.1 స్థానం. అంటే డేంజర్ పరంగా మహారాష్ట్రకు తెలంగాణ ఏం తీసిపోదు అని దీనర్థం.
దేశంలోనే అతితక్కువ టెస్టులు చేసిన తెలంగాణపై అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక క్రమంగా టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. దాంతో నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే అందరికీ కనిపించే ఈ కేసుల నెంబరు కన్నా కరోనా తెలంగాణలో వ్యాప్తిస్తున్న తీరు ప్రజలను ప్రభుత్వాన్ని భయకంపితులను చేస్తోంది.
వారం క్రితం వరకు వందల్లో వచ్చిన కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. వారం నుంచి రోజుకు వెయ్యికి అటూ ఇటూ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. శుక్రవారం ఏకంగా 1892 కేసులు బయటపడ్డాయి. ఇది నగర పరిస్థితి తీరుకు, తెలంగాణలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. చేసిన టెస్టుల్లో వందకు ఎన్ని పాజిటివ్ అన్నది చూస్తే తెలంగాణ మొదటి స్థానంలో, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉండటం గమనార్హం.
ఇప్పటివరకు చేసిన టెస్టులు – లక్షా 4 వేలు
మొత్తం కేసులు – 20,462
ఓవరాల్ పాజిటివ్ రేటు – 19.65 శాతం
గత వారం రోజుల పాజిటివ్ రేటు – 31.71 శాతం
ఇతర రాష్ట్రాల పరిస్థితి
మహారాష్ట్ర – 18.34 శాతం
ఢిల్లీ – 16.1 శాతం
తమిళనాడుల – 8 శాతం
ఏపీ – 1.74 శాతం
This post was last modified on July 4, 2020 2:10 pm
ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…
దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…
కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు, గ్యాస్ సమస్యలతో ఇరకాటంలో పడ్డాయి. అనేక దేశాల్లో మారకం…