Political News

ఇలాంటి విమర్శలు చంద్రబాబు నోటి నుంచా?

సంచలన ఆరోపణ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి విషయానికి అవసరానికి మించి స్పందించే ఆయన తీరుతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆయనలో అభద్రతా భావం అంతకంతకూ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. అవసరం లేకున్నా అదే పనిగా మాట్లాడే ధోరణి ఎక్కువ అవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద విమర్శలు.. ఆరోపణలు చేసేటప్పడు తగిన ఆధారాలతో ప్రజల ముందుకు రావటం బాగుంటుంది.

అందుకు భిన్నంగా ఎల్లయ్యో.. పుల్లయ్యో చెప్పే మాటల్ని పట్టుకొని అదే పనిగా ప్రెస్ మీట్ లు పెట్టేసి ఆరోపణలు చేస్తే.. లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అధినేత అన్న వ్యక్తి ఆచితూచి అన్నట్లు మాట్లాడాలి. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేత నోటి నుంచి ఏదైనా విమర్శ.. ఆరోపణ వస్తుందంటే అందరూ అలెర్టు అయ్యేలా ఉండాలి. అంతేకానీ.. కామెడీ చేసుకునేలా ఉండకూడదు.

తాజాగా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసే క్రమంలో సంచలన ఆరోపణ ఒకటి జగన్ సర్కారు మీద సంధించారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయాన్ని తుంగులోకి తొక్కారని.. రాష్ట్రాన్ని మూడుముక్కలు చేశారంటూ మండిపడ్డారు. ఏపీ డీజీపీ ఆఫీసులో ఒక వ్యక్తిని పెట్టి మరీ.. రోజూ ఎవరెవరిపైన కేసులు పెట్టాలన్న డైరెక్షన్ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాము సైతం అదే తీరులో చేసి ఉంటే.. ఇవాల్టి రోజున జగన్ పరివారం సోదిలో ఉండేదా? అని ప్రశ్నించారు.

జగన్ సర్కారు తమనెంత వేధించినా పోరాడతామని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర డీజీపీ ఆఫీసులో ఉండే వ్యక్తి ఎవరన్న విషయాన్ని ఆధారాలతో సహా రివీల్ చేసి ఉంటే బాగుండేది. దీనికి సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే మరింత బాగుండేది. అందుకు భిన్నంగా అదే పనిగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం బాబుకు ఎప్పటికి అర్థమవుతుందో?

This post was last modified on July 4, 2020 8:26 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

58 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago