Political News

తోకపార్టీగా మిగిలిపోవటం ఖాయమా?

వామపక్షాల్లో పోరాట స్పూర్తి తగ్గిపోయినట్లే ఉంది. ఎప్పుడైతే పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మొదలుపెట్టారో అప్పుడే వామపక్షాల పతనం మొదలైంది. అధికారంలో ఉండే కాంగ్రెస్, టీడీపీ లేదా టీఆర్ఎస్ తో పొత్తులకు అర్రులు చాచారో అప్పటినుండే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కనపెట్టేశారు. ఎంతసేపు అధికారంలో ఉన్నపార్టీతో లాలూచీ రాజకీయాలు, లాబీయింగ్ తో వ్యక్తిగత లబ్దికి పాకులాడటం మొదలుపెట్టారో అప్పుడే జనాల్లో కూడా వామపక్షాలపై నమ్మకం పోయింది.

ఇపుడు ఇదంతా ఎందుకంటే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయించింది. ఈరోజే రేపో సీపీఎం కూడా తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. నిజానికి సీపీఐ+సీపీఎం కలిసి ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపేంత శక్తి ఉంది. అయినా దాన్ని వదిలేసి టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది. 1985 నుండి జరిగిన ఎన్నికల్లో సీపీఐ 5 సార్లు మునుగోడులో గెలిచింది. అంటే సీపీఐకి బాగా పట్టున్నట్లే అర్ధమవుతోంది. ఈ పార్టీకి సీపీఎం కూడా తోడైతే మిగిలిన పార్టీలకు ఇబ్బందులు తప్పవు.

ఇక్కడ గెలుపోటములను పక్కనపెట్టి వామపక్షాలు రెండు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తే గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. విచిత్రం ఏమిటంటే మునుగోడులో పోటీ చేయడానికి సీపీఐ సిద్ధంగా లేదని ఆ పార్టీ ప్రకటించటం. అంటే ఉపఎన్నికలో పోటీ చేయకూడదని ముందే సీపీఐ నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. దీనికన్నా విచిత్రం ఏమిటంటే ఇంతకాలం ఏ ప్రభుత్వం మీదైతే పోరాటాలు చేస్తున్నట్లు వామపక్షాలు చెప్పుకుంటున్నాయో ఇపుడు అదే పార్టీకి మద్దతివ్వటం.

టీఆర్ఎస్ కు మద్దతివ్వటం అంటే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కన పెట్టేసినట్లు కాదని ప్రకటించటమే పెద్ద జోక్. ఒకవైపు అధికారపార్టీకి మద్దతిచ్చి మరోవైపు అదే ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామంటే నమ్మటానికి జనాలేమన్నా పిచ్చోళ్ళా. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు, ప్రకటనలతోనే జనాల్లో వామపక్షాలంటే నమ్మకం కోల్పోయేలా చేసుకున్నాయి. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో ఎర్రన్నలకే తెలియాలి. 

This post was last modified on August 21, 2022 6:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

41 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago