Political News

కేసీఆర్ ఎందుకు వెనకాడినట్లు?

అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఎటూ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి అభ్యర్ధిని ప్రకటిస్తారని అందరు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. పావుగంట సేపు మాట్లాడిన కేసీయార్ అభ్యర్ధి గురించి అసలు ఏమీ ప్రస్తావించలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించమన్నారే కానీ పలానా అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నట్లు చెప్పలేదు.

అభ్యర్ధిని పరిచయం చేయటానికి బహిరంగ సభకు మించిన అవకాశం ఏముంటుంది ? ఇక్కడ సమస్య ఏమిటంటే అభ్యర్ధిని ప్రకటిస్తే పార్టీలో ఎలాంటి సమస్య వస్తుందో అని కేసీఆర్ భయపడుతునట్లున్నారు. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్ధిగా దింపాలని కేసీయార్ డిసైడ్ చేశారు. అయితే సీఎం నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గంలోని నేతల్లో అత్యధికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కూసుకుంట్లే అభ్యర్ధి అయితే నేతల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో కూడా తెలీటంలేదు.

కేసీఆర్ ఆలోచన అర్ధమైన నేతల్లో కొందరు ఇప్పటికే టీఆర్ఎస్ కు రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోయారు. ఇంకొందరు అదే బాటలో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఏమి చేయాలో కేసీఆర్ కు అర్ధమవుతున్నట్లులేదు. మెజారిటీ నేతల డిమాండ్ ప్రకారం వేరే  అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలా ? లేకపోతే నేతలను పట్టించుకోకుండా కూసుకుంట్లనే అభ్యర్ధిగా ప్రకటించాలా ? అనే డైలమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కూసుకుంట్లను ప్రకటించేస్తే పార్టీ పుట్టి ముణిగిపోతుందని భయపడినట్లున్నారు. అందుకనే వ్యూహాత్మకంగా పార్టీకి ఓట్లేసి గెలిపించమని మాత్రమే కోరారు. బహిరంగ సభలోనే అభ్యర్ధిని కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు పార్టీలో, మీడియాలో బాగా ప్రచారమైంది. చివరకు పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించిన తర్వాతే కేసీఆర్ వెనక్కుతగ్గారు. విషయం ఏమిటంటే కూసుకుంట్లను అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటించినా పార్టీలో ఇదే సమస్య ఉంటుందని కేసీఆర్ మర్చిపోయినట్లున్నారు. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. 

This post was last modified on August 21, 2022 2:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

6 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

6 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

7 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

7 hours ago