అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఎటూ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి అభ్యర్ధిని ప్రకటిస్తారని అందరు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. పావుగంట సేపు మాట్లాడిన కేసీయార్ అభ్యర్ధి గురించి అసలు ఏమీ ప్రస్తావించలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించమన్నారే కానీ పలానా అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నట్లు చెప్పలేదు.
అభ్యర్ధిని పరిచయం చేయటానికి బహిరంగ సభకు మించిన అవకాశం ఏముంటుంది ? ఇక్కడ సమస్య ఏమిటంటే అభ్యర్ధిని ప్రకటిస్తే పార్టీలో ఎలాంటి సమస్య వస్తుందో అని కేసీఆర్ భయపడుతునట్లున్నారు. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్ధిగా దింపాలని కేసీయార్ డిసైడ్ చేశారు. అయితే సీఎం నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గంలోని నేతల్లో అత్యధికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కూసుకుంట్లే అభ్యర్ధి అయితే నేతల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో కూడా తెలీటంలేదు.
కేసీఆర్ ఆలోచన అర్ధమైన నేతల్లో కొందరు ఇప్పటికే టీఆర్ఎస్ కు రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోయారు. ఇంకొందరు అదే బాటలో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఏమి చేయాలో కేసీఆర్ కు అర్ధమవుతున్నట్లులేదు. మెజారిటీ నేతల డిమాండ్ ప్రకారం వేరే అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలా ? లేకపోతే నేతలను పట్టించుకోకుండా కూసుకుంట్లనే అభ్యర్ధిగా ప్రకటించాలా ? అనే డైలమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కూసుకుంట్లను ప్రకటించేస్తే పార్టీ పుట్టి ముణిగిపోతుందని భయపడినట్లున్నారు. అందుకనే వ్యూహాత్మకంగా పార్టీకి ఓట్లేసి గెలిపించమని మాత్రమే కోరారు. బహిరంగ సభలోనే అభ్యర్ధిని కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు పార్టీలో, మీడియాలో బాగా ప్రచారమైంది. చివరకు పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించిన తర్వాతే కేసీఆర్ వెనక్కుతగ్గారు. విషయం ఏమిటంటే కూసుకుంట్లను అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటించినా పార్టీలో ఇదే సమస్య ఉంటుందని కేసీఆర్ మర్చిపోయినట్లున్నారు. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
This post was last modified on August 21, 2022 2:48 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…