Political News

లైన్ దాటిన ఉద్యోగసంఘాల నేత

ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడటం, వాటిని పరిష్కరించేట్లుగా చేయటమే ఉద్యోగసంఘాల నేతల పని. అంతేకానీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యోగులకు, ప్రజలకు పిలుపివ్వటం కాదు. ఇపుడీ టాపిక్ ఎందుకంటే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి లైన్ దాటారు కాబట్టే చెప్పుకోవాల్సొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం రెడ్డి మాట్లాడుతు ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

జడ్జీలపై వాట్సప్ గ్రూపుల్లో మెసేజీలు పెడితే మూడునెలలు బెయిల్ రాదని కానీ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు తిడితే గంటలోనే బెయిల్ వచ్చేస్తోందన్నారు. జడ్జీలకే ఆత్మాభిమానం ఉంటుందా ? సీఎంకు ఉండదా ? అని రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఈ ఉద్యోగనేత మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే తమకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతోందని ప్రజలు అనుకుంటే కచ్చితంగా ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించుకుంటారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వల్ల ఉపయోగం లేదని అనుకోబట్టే జనాలు వైసీపీకి అఖండవిజయాన్ని అందించారు. అప్పుడుకూడా ఎన్నికలకు ముందు ఇపుడు రెడ్డి చెప్పినట్లుగానే అప్పట్లో ఉద్యోగనేతలు చెప్పారు. కానీ ఉద్యోగులు, జనాలు వాళ్ళు చెప్పిన మాటలను విన్నారా ? రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని జనాలు అనుకుంటే కచ్చితంగా ఓడగొడతారు. ఒకపార్టీని గెలిపించటంలోను ఓడించటంలోను జనాలకు ఎలాంటి మొహమాటాలుండవు. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని రెడ్డి పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది.

ఇక జడ్జీలకు వ్యతిరేకంగా మెసేజులు పెడితే మూడునెలలు జైలు, సీఎంను తిడితే ఒక్కరోజులోనే బెయిలంటు బాధపడ్డారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జడ్జీలిచ్చే తీర్పులపై ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కానీ వ్యక్తిగతంగా జడ్జీలను దూషించకూడదంతే. జడ్జీలైననా, సీఎంను అయినా వ్యక్తిగతంగా దూషించకూడదని మాత్రమే రెడ్డి చెప్పాలి. ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారాలపైన మాత్రమే ఉద్యోగుల నేతలు దృష్టిపెడితే బాగుంటుంది. అభిమానముంటే లోపల్లోపల చూపించుకోవాలి. అంతేకానీ రాజకీయనేతల్లాగ బహిరంగంగా పిలుపిస్తే అభాసుపాలవ్వటం ఖాయం.  

This post was last modified on August 20, 2022 11:01 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

52 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago