Political News

ఢిల్లీ లీక్క‌ర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా నివాసాలు స‌హా 31 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. గ‌త న‌వంబ‌రులో ప్ర‌వేశ పెట్టిన నూత‌న మ‌ద్యం పాల‌సీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయ‌ని .. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని.. ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు.. సోదాలు చేసింది. అంతేకాదు.. ఉప‌ముఖ్య‌మంత్రిపై ఎఫ్ ఐఆర్ కూడా న‌మోదు చేసింది.

అయితే.. ఇప్పుడు ఈ సీబీఐ సోదాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీల‌క మ‌ద్యం వ్యాపారుల‌కు ఈ లిక్క‌ర్ స్కాంలో సంబంధాలు ఉన్నాయ‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. వీరిలో ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీ కూడా ఒక‌రు ఉన్నార‌ని.. ఆయ‌న‌పై సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు కొన్ని రోజుల కిందట పేరు పెట్టి మ‌రీ ఆరోప‌ణ‌లు చేశారని.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో డిల్లీలో జ‌రుగుతున్న సీబీఐ దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి.

ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4 గంటల పాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో స్పిరిట్‌ గ్రూప్‌ ఎండీతో పిళ్లైకి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ అభియోగం.

ఈ స్కాంలో రెండో నిందితుడిగా ఉన్న తెలుగు ఐఏఎస్‌ అధికారి గోపీకృష్ణ ఇంట్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 31చోట్ల సీబీఐ దాడులు చేసింది. మ‌రోవైపు.. ఏపీకి చెందిన ఎంపీ నివాసాల్లోనూ దాడులు జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని పెద్ద ఎత్తున గుస‌గుస వినిపిస్తోంది.

This post was last modified on August 20, 2022 4:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

48 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago