Political News

జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు

ఏపీ సీఎం జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారా? రాష్ట్రంలో ఆయ‌న అనుకుంటున్న‌ట్టుగా.. ఏమీ జ‌ర‌గడం లేదా?  ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీలోని కీల‌క నాయ‌కులు. ముఖ్యంగా గ‌త మేనిఫెస్టో క‌మిటీలో ఉన్న గుంటూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. “మేనిఫెస్టోలో ఉన్న‌వ‌న్నీ.. అమ‌లు చేస్తున్నాం. కానీ.. ప్ర‌జ‌లు ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దీనిని రీచ్ కాలేక పోతున్నాం. ఇది వాస్త‌వం“ అని ఆయ‌న ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల ముందు వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. దానిలో అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాలను సంతృప్తి ప‌రిచేందుకు తాను ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మేనిఫెస్టోను భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్, ఖురాన్ అంటూ.. ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. ఈ క్ర‌మంలో గ‌త టీడీపీ ప్ర‌భుత్వం మేనిఫెస్టోను దాచేసింద‌ని కూడా విమ‌ర్శ‌ల‌ రాళ్లు రువుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇదే మేనిఫెస్టో.. ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారింద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆదిలో అంద‌రికీ అన్ని ప‌థ‌కాల‌ను అందించిన ప్ర‌భుత్వం త‌ర్వాత త‌ర్వాత‌.. ఆర్థిక భారం పెరిగిపోవ‌డం .. అప్పులు పుట్ట‌క‌పోవ‌డం.. పుట్టినా.. అర‌కొర‌గా అంద‌డంతో ఈ మేనిఫెస్టోను కొంద‌రికే ప‌రిమితం చేయాల్సి వ‌చ్చింది. దీంతో ల‌బ్ధి దారుల సంఖ్య‌ను ఎడా పెడా కోత‌పెట్టారు. దీంతో ప్ర‌జ‌ల్లోనూ ప్ర‌భుత్వంపై విశ్వ‌స‌నీయ‌త త‌గ్గిపోయింద‌నే విష‌యం ప్ర‌భుత్వానికి వెల్ల‌డైంది. మ‌రోవైపు.. ఉద్యోగుల‌ను ఎంత వారించినా.. వారికి ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన పీఆర్సీ.. సీపీఎస్ ర‌ద్దు వంటి హామీలను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుండ‌డం జ‌గ‌న్ కు మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది.

వీటిని కాద‌న‌లేని ప‌రిస్థితి.. అలాగ‌ని చేయ‌లేని దుస్థితిలో స‌ర్కారు అడ‌క‌త్తెర‌లో నిల‌బ‌డిపోయింది. ఈ ప‌రిణామాలు స‌ర్కారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయ‌నేది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఏం చేయాలి?  ఇన్ని కోట్ల రూపాయ‌లు అప్పులు చేస్తున్నామ‌నే అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకుంటున్నా.. ప్ర‌జ‌ల్లో సానుభూతి నానాటికీ.. త‌గ్గిపోతుండ‌డం ప‌ట్ల‌.. సీఎం ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇదే ప‌ద్ధ‌తి ఇంకా కొన‌సాగితే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఉద్యోగ సంఘాల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు కూడా ఫ‌లించ‌లేదు. దీంతో ప్ర‌భుత్వం రాబోయే రోజుల్లో ఏదో ఒక మార్పు దిశ‌గా అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on August 20, 2022 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుకుమార్ రైటింగ్స్.. ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…

15 minutes ago

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

4 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

4 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

8 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

12 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

14 hours ago