Political News

ఏపీలో అర‌డ‌జ‌ను మంది మంత్రుల‌కు ఇదే ప‌ని

మంత్రి అంటే.. ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను.. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన అధికారుల‌తో అమ‌లు చేయించ‌డం.. అవి స‌క్ర‌మంగా అమ‌ల‌వుతున్నాయో.. లేదో.. చూడ‌డం కీల‌క ప‌ని. అంతేకాదు.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే అర్జీల‌ను ప‌రిష్క‌రించ‌డం.. అవి ఏదశ‌లో ఉన్నాయో చూడ‌డం.. ప్ర‌జ‌ల‌కు కుదిరితే అందుబాటులో ఉండ‌డం కూడా అమాత్యుల విధుల్లో కీల‌క‌మైన వ్య‌వ‌హారం. అయితే.. ఏపీలో ఉన్న మంత్రులు ఈ విధుల‌ను ప‌క్క‌న పెట్టేశారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దాదాపు అర‌డ‌జ‌ను మంది మంత్రులు వారం వారం.. ప‌నిగ‌ట్టుకుని తిరుమ‌ల బాట ప‌డుతున్నారు.

తామే కాదు.. త‌మ అనుచ‌రుల‌నుకూడా తీసుకువెళ్తూ.. హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. దీంతో ఏపీ మంత్రుల‌కు ప‌నిలేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అయితే.. రెండోసారి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌.. త‌ర్వాత వారం వారం ఆల‌యానికి వెళ్తున్నారు. ఆదిలో ఈయ‌న‌కు అతిథి మ‌ర్యాదలు బాగానే ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత‌.. టీటీడీ అధికారులు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసి.. కింది స్థాయి ఉద్యోగుల‌కు బాధ్య‌త అప్ప‌గించారు. అయినా.. ఈయ‌న మాత్రం మాన‌డం లేదు.. మార‌డ‌మూ లేదు.

ఇక‌, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి రోజా ప‌రిస్థితి కూడా ఇంతే. ప్ర‌తి 15 రోజుల‌కు ఠంచ‌నుగా.. తిరుమ‌ల బాట‌ప‌డు తున్నారు. త‌ను మాత్ర‌మేకాదు.. త‌న వెంట మందీ మార్బ‌లాన్ని కూడా తీసుకువెళ్తున్నారు. దీంతో తిరుమ‌ల అధికారులు విసుగు వ‌చ్చిందో ఏమో.. ఆమెనుకూడా ప‌క్క‌న పెట్టేశారు. అయినా.. ఆమె మాత్రం తిరుమ‌ల బాట వీడ‌డం లేదు. అదేవిధంగా మంత్రి నారాయ‌ణ స్వామి కూడా ప్ర‌తి 20 రోజుల‌కు ఒక‌సారి తిరుమ‌ల ద‌ర్శ‌నం త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్టుగా వెళ్తున్నారు. ఆయ‌న కూడా కుటుంబాన్ని త‌న‌వెంట తీసుకువెళ్తున్నారు.

మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌, సీదిరి అప్ప‌ల రాజులు కూడా ప్ర‌తి 15 రోజులు లేదా నెల‌లో ఒక‌సారి ఠంచనుగా తిరుమ‌ల ద‌ర్శ‌నం చేయా ల్సిందే. దీంతో సాధార‌ణ భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌నేది మాత్రం వాస్త‌వం. శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం త‌ప్పుకాదు.. కానీ, ఇలా ప‌దే ప‌దే తిరుమ‌ల బాట ప‌ట్ట‌డం.. ఉన్న ప‌నిని వ‌దిలేయ‌డం.. వంటివే ఇప్పుడు మంత్రుల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. గ‌తంలో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కూడా ఇలానే చేసేవారు. దీంతో పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను క‌ట్ట‌డి చేసింది. మ‌రి మంత్రుల విష‌యంలో ఎందుకు ఉపేక్షిస్తోంద‌నేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. మంత్రుల వ్య‌వ‌హారంపై మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on August 20, 2022 10:58 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

32 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

49 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago