మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకుని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే బలప్రదర్శనకూ దిగుతున్నాయి. ఈనెల 20వ తేదీన నియోజకవర్గం కేంద్రం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కనీవినీ ఎరుగనంత స్ధాయిలో జనసమీకరణ చేయాలని ఇప్పటికే కేసీయార్ ఆదేశించారు. 25 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మందిని తీసుకురావాలని టార్గెట్ గా చాలామంది నేతలు పనిచేస్తున్నారు.
కచ్చితంగా టీఆర్ఎస్ ది బలప్రదర్శననే చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ బహిరంగసభ జరిగిన మరుసటి రోజు అంటే 21వ తేదీన నియోజకవర్గంలోని చౌటుప్పల్ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బహిరంగసభ జరగబోతోంది. ఈ సభ నిర్వహణ కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ, బీజేపీలో చేరి మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యక్తిగతంగా సవాల్ లాంటిది. తన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తన సత్తా ఏమిటో చాటాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.
రాజగోపాల్ ఎందుకింత పట్టుదలగా ఉన్నారంటే ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. అమిత్ షా సమక్షంలోనే రాజగోపాల్ పార్టీలో చేరబోతున్నారు కాబట్టే. తానెంతటి శక్తిమంతుడో షాకి చాటి చెప్పేందుకే మాజీ ఎంఎల్ఏ చాలా కష్టపడుతున్నారు. నిజానికి మునుగోడులో రాజగోపాల్ బలమే బీజేపీ బలమని అందరికీ తెలుసు. ఇక్కడ పార్టీకంటు వున్న బలం చాలా నామమాత్రమే. రేపు రాజగోపాల్ గెలిచినా అది పూర్తిగా వ్యక్తిగత విజయమే కానీ పార్టీ వల్ల గెలవటం కాదు.
హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ఎలా గెలిచారో మునుగోడులో రాజగోపాల్ కూడా అలాగే గెలవాలి. ఇందుకే బహిరంగ సభ నిర్వహణ, ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతోంది. టీఆర్ఎస్ బహిరంగసభ జరిగిన మరుసటి రోజే బీజేపీ సభ జరుగుతోంది కాబట్టి కచ్చితంగా హాజరైన జనాల విషయంలో పోలికుంటుంది. ఇక కాంగ్రెస్ కూడా బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ సభ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 19, 2022 6:58 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…