సొంత పార్టీ లేదు.. వైరి పక్షము అన్నది లేదు. తమకు పడని వాళ్లు ఎవరైనా సరే.. తమ మాటల తూటాల తాకిడికి విలవిలలాడేలా వ్యాఖ్యలు చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థి పార్టీల విషయంలో అస్సలు తగ్గనట్టుగా వ్యవహరించే తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సొంత పార్టీ వారిపై కూడా విరుచుకుపడుతుంటారు. అధికారం చేతిలోకి వచ్చిన మూడేళ్లలోనే.. ఏపీలోని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు సొంత పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కమ్ నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీకి చెందిన ఒక నేత సిగ్గుమాలిన పని చేస్తున్నట్లుగా మండిపడ్డారు. నెల్లూరు పట్టణంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వమనే ప్రోగ్రాంలో అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనసులో రగిలిపోతున్న అసంతృప్తిని బయటపెట్టకుండా ఉండలేకపోయారు. మీడియాతో మాట్లాడే వేళలో ఓపెన్ అయిపోయారు. తమ పార్టీలో ఉండి కూడా సిగ్గు లేని పనులు చేస్తున్నట్లుగా ఫైర్ అయ్యారు.
విపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలతో వైసీపీ నేత ఒకరు నిత్యం మంతనాలు నడుపుతున్నట్లుగా ఆరోపించారు. వైసీపీ నేత ఒకరు వెన్నుపోటు రాజకీయాల్ని చేస్తున్నారని.. ఇలాంటి పనులు చేస్తున్న వారి కాల్ డేటా హిస్టరీ మొత్తం తన వద్ద ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు. త్వరలోనే వారి బండారం మొత్తాన్ని బయటపెడతానని చెప్పారు. ఇంతకీ సొంత పార్టీని బలిపెట్టేలా వ్యవహరిస్తున్న నేత ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది.
అయినా.. పార్టీకి చెందిన దరిద్రపుగొట్టు పనులు చేస్తూ.. విపక్షాలతో చెట్టాపట్టాలు వేసుకునే విషయానికి సంబంధించిన ఆధారాలు ఉండి ఉంటే.. ఇలా మీడియా ముందుకు రావటం కంటే.. పార్టీ అధినేతకు గుట్టుగా వివరాలు పంపితే సరిపోతుంది కదా? పార్టీ పరువును తన మాటలతో బజారున పెట్టిన మాజీ మంత్రికి.. ఆయన ఆరోపించినట్లుగా విపక్ష నేతలతో టచ్ లో ఉండటం కూడా ఒకేలాంటి నేరం కదా? అంటూ అనిల్ ఆరోపణలపై మండిపడుతున్నారు. మరి.. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.
This post was last modified on August 19, 2022 4:35 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…