Political News

రాజగోపాల్ చెప్పినట్లే జరుగుతోందా?

మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసేటపుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే చెప్పారో ఇపుడు అదే జరుగుతోందా ? కేసీఆర్ వైఖరి చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడేళ్ళుగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం తాను ఎన్ని ప్రతిపాదనలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాజగోపాల్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఇక ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని అన్నారు.

తాను రాజీనామా చేస్తే అన్నా కేసీఆర్ మునుగోడు అభివృద్ధిని పట్టించుకుంటారేమో అని చెప్పి రాజీనామా చేశారు. అప్పుడు రాజగోపాల్ ఏదైతే చెప్పారో ఇపుడు కేసీయార్ అలాగే చేస్తున్నారు. ఉపఎన్నిక ఖాయమవ్వటంతో టీఆర్ఎస్ గెలుపు కోసమని ప్రభుత్వం ఆగమేఘాల మీద అభివృద్ధి పనులు మొదలుపెడుతోంది. మండలాలు, గ్రామాలవారీగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తోంది. చేయాల్సిన డెవలప్మెంట్ పనులను యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టేస్తోంది.

జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్దికి ప్రణాళికలను యంత్రాంగం తయారుచేస్తోంది. ప్రణాళికల ప్రకారం సీఎం ఆమోదం తీసుకుని ఆర్ధికశాఖ నిధులను విడుదల చేసేస్తోంది. పంచాయతీరాజ్ భవనాల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, అంగన్ వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే సుమారు రు. 100 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20వ తేదీన మునుగోడు హెడ్ క్వార్టర్స్ లో ప్రజా దీవెన పేరుతో కేసీఆర్ బహిరంగ సభ జరగబోతోంది.

బహిరంగ సభకు ముందుగానే నిధులు విడుదల చేసి పనులు మొదలుపెట్టాలని కేసీయార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారట. అయితే ఇక్కడ కేసీయార్ గమనించాల్సిందేమంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా అభివృద్ధి పనులు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నంతవరకు నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగలేదని అర్ధమైపోయింది. కారణాలు ఏవైనా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేదు. మరిపుడు మునుగోడులో కూడా హుజూరాబాద్ పద్దతిలోనే నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టిస్తున్నారు. అంటే తనకిష్టం లేని ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎలాంటి డెవలప్మెంట్ చేయరని అర్ధమైపోయింది. మరి మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందని గ్యారెంటీ ఏమిటి ? 

This post was last modified on August 18, 2022 9:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago