Political News

రాజగోపాల్ చెప్పినట్లే జరుగుతోందా?

మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసేటపుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే చెప్పారో ఇపుడు అదే జరుగుతోందా ? కేసీఆర్ వైఖరి చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడేళ్ళుగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం తాను ఎన్ని ప్రతిపాదనలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాజగోపాల్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఇక ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని అన్నారు.

తాను రాజీనామా చేస్తే అన్నా కేసీఆర్ మునుగోడు అభివృద్ధిని పట్టించుకుంటారేమో అని చెప్పి రాజీనామా చేశారు. అప్పుడు రాజగోపాల్ ఏదైతే చెప్పారో ఇపుడు కేసీయార్ అలాగే చేస్తున్నారు. ఉపఎన్నిక ఖాయమవ్వటంతో టీఆర్ఎస్ గెలుపు కోసమని ప్రభుత్వం ఆగమేఘాల మీద అభివృద్ధి పనులు మొదలుపెడుతోంది. మండలాలు, గ్రామాలవారీగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తోంది. చేయాల్సిన డెవలప్మెంట్ పనులను యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టేస్తోంది.

జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్దికి ప్రణాళికలను యంత్రాంగం తయారుచేస్తోంది. ప్రణాళికల ప్రకారం సీఎం ఆమోదం తీసుకుని ఆర్ధికశాఖ నిధులను విడుదల చేసేస్తోంది. పంచాయతీరాజ్ భవనాల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, అంగన్ వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే సుమారు రు. 100 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20వ తేదీన మునుగోడు హెడ్ క్వార్టర్స్ లో ప్రజా దీవెన పేరుతో కేసీఆర్ బహిరంగ సభ జరగబోతోంది.

బహిరంగ సభకు ముందుగానే నిధులు విడుదల చేసి పనులు మొదలుపెట్టాలని కేసీయార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారట. అయితే ఇక్కడ కేసీయార్ గమనించాల్సిందేమంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా అభివృద్ధి పనులు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నంతవరకు నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగలేదని అర్ధమైపోయింది. కారణాలు ఏవైనా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేదు. మరిపుడు మునుగోడులో కూడా హుజూరాబాద్ పద్దతిలోనే నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టిస్తున్నారు. అంటే తనకిష్టం లేని ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎలాంటి డెవలప్మెంట్ చేయరని అర్ధమైపోయింది. మరి మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందని గ్యారెంటీ ఏమిటి ? 

This post was last modified on August 18, 2022 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

16 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

55 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago