రాజకీయాల్లో రోజులన్నీ.. ఒకే విధంగా ఉండవు. నిన్న ఉన్నట్టుగా ఈ రోజు.. ఈ రోజు ఉన్నట్టు రేపు కూడా ఉండే అవకాశం లేదు. ఈ విషయాన్ని నాయకులు గ్రహించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా.. తమ తమ విధానాలను మార్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మాత్రం ఇలాంటి మార్పు కనిపించడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. నాయకులు పెడచెవిన పెడుతున్నారు.
ప్రజల్లో ఉండాలని.. వారి సమస్యలు తెలుసుకోవాలని.. ప్రజలకు అండగా ఉండాలని.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని.. ఇలా అనేక విషయాలపై చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకుల్లో మార్పు రాలేదు. ఇక, ఇప్పుడు.. మరోసారి నాయకు లకు తలంటే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అంతా కూడా.. నాయకులను తన దగ్గరకు పిలుచుకుని.. వారికి దిశానిర్దేశం చేయాలని భావించారు.
ఈ క్రమంలోనే తాజాగా నాలుగు నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్లు.. ఇతర నాయ కులతో ఆయన భేటీ అయ్యారు. వీటిలో కీలకమైన పెనమలూరు కూడా ఉండడం గమనార్హం. అదేసమ యంలో సంతనూతలపాడు.. కూడా.. ఉంది. అయితే.. తాజాగా భేటీలోనూ చంద్రబాబు పాడిందే పాట అన్నట్టుగా.. నాయకులకు దిశానిర్దేశం చేయడంతోనే సరిపుచ్చారు. ఎక్కడా వారికి ఎలాంటి వీసమెత్తు హెచ్చరిక కూడా చేయలేదు.
మీరు సరిగా పనిచేయకపోతే.. టికెట్లు ఇచ్చేది లేదని.. సాక్షాత్తూ ఎమ్మెల్యేలకే వైసీపీ అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో టికెట్లపై బెంగతోనో.. లేక.. అధినేత ఆదేశాలంటే.. గౌరవంతోనో.. వైసీపీ నాయకులు ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ, ఇలాంటి పరిస్థితి టీడీపీలో కనిపించడం లేదు. చంద్రబాబు చెప్పింది వింటున్నారు.. తలలు ఊపుతున్నారు. తర్వాత.. ఎవరి మానాన వారు తమ తమ పనుల్లో మునిగితేలుతున్నారు. మరి ఈ పరిస్థితి మారాలంటే.. కొంత చంద్రబాబు కూడా మారాలని అంటున్నారు పరిశీలకులు. నాయకులకు బలమైన సంకేతాలు.. పంపాల్సి ఉంటుందని అంటున్నారు.
This post was last modified on August 18, 2022 9:39 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…