Political News

చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌పాటే..

రాజ‌కీయాల్లో రోజుల‌న్నీ.. ఒకే విధంగా ఉండ‌వు. నిన్న ఉన్న‌ట్టుగా ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు కూడా ఉండే అవ‌కాశం లేదు. ఈ విష‌యాన్ని నాయ‌కులు గ్ర‌హించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా.. త‌మ త‌మ విధానాల‌ను మార్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం ఇలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీ అధినేత  చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. నాయ‌కులు పెడ‌చెవిన పెడుతున్నారు.

ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని.. వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని.. ఇలా అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది నాయ‌కుల్లో మార్పు రాలేదు. ఇక‌, ఇప్పుడు.. మ‌రోసారి నాయ‌కు ల‌కు త‌లంటే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అంతా కూడా.. నాయ‌కుల‌ను త‌న ద‌గ్గ‌ర‌కు పిలుచుకుని.. వారికి దిశానిర్దేశం చేయాల‌ని భావించారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు.. ఇత‌ర నాయ కుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. వీటిలో కీల‌క‌మైన పెన‌మ‌లూరు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ యంలో సంత‌నూత‌ల‌పాడు.. కూడా.. ఉంది. అయితే.. తాజాగా భేటీలోనూ చంద్ర‌బాబు పాడిందే పాట అన్న‌ట్టుగా.. నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌డంతోనే స‌రిపుచ్చారు. ఎక్క‌డా వారికి ఎలాంటి వీస‌మెత్తు హెచ్చ‌రిక కూడా చేయ‌లేదు.

మీరు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే.. టికెట్లు ఇచ్చేది లేద‌ని.. సాక్షాత్తూ ఎమ్మెల్యేలకే వైసీపీ అధినేత జ‌గ‌న్ హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. దీంతో టికెట్ల‌పై బెంగ‌తోనో.. లేక‌.. అధినేత ఆదేశాలంటే.. గౌర‌వంతోనో.. వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. కానీ, ఇలాంటి ప‌రిస్థితి టీడీపీలో క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు చెప్పింది వింటున్నారు.. త‌ల‌లు ఊపుతున్నారు. త‌ర్వాత‌.. ఎవ‌రి మానాన వారు త‌మ త‌మ ప‌నుల్లో మునిగితేలుతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి మారాలంటే.. కొంత చంద్ర‌బాబు కూడా మారాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నాయ‌కుల‌కు బ‌ల‌మైన సంకేతాలు.. పంపాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

10 minutes ago

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

58 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

5 hours ago