Political News

కేసీఆర్ మీద కేసు పెట్టే ధైర్యముందా?

ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేయాలి ? ఆ ఆరోపణలపై అధ్యయనం చేయాలి. అవినీతి జరిగిందని అనుమానమొస్తే శాఖాపరమైన విచారణ జరిపించాలి. అవినీతి నిర్ధారణైతే వెంటనే సదరు వ్యక్తిపై కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాలి. మామూలుగా జరిగే విధానమిదే. మరిప్పుడు అలాంటిదేమీ లేకుండా డైరెక్టుగా సంబంధిత శాఖ మంత్రే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఏమి చేయాలి ? వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి.

మరిపుడు కేసీయార్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేంత ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా ? అన్నదే కీలకమైన ప్రశ్న. ఇపుడిదంతా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టీఆర్ఎస్ అవినీతి హద్దులన్నీ దాటేసిందని మంత్రి మండిపోయారు. ప్రాజెక్టుకు చట్టబద్దమైన అనుమతులు తీసుకోకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాలు చేసేసినట్లు మంత్రి ఆరోపించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మొన్నటి భారీ వర్షాలు, వరద కారణంగా పంపులు ముణిగిపోయాయని చెప్పి మరి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని రెచ్చిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రే ధృవీకరించినాక కేసీయార్ పై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ లేదా ఈడీ ద్వారా కేసులు నమోదు చేయవచ్చు కదా ? అవినీతి జరిగిందని చెబుతున్నారంటే షెకావత్ దగ్గర అన్నీ ఆధారాలున్నట్లే అనుకోవాలి.

తన దగ్గరున్న ఆధారాలతో కేసీఆర్ పైన కేసు పెట్టి అరెస్టు చేయించచ్చుకదా ? ఇంకా ఎందుకు షెకావత్ కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నారు. తన శాఖ పరిధిలోనే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్దారణైతే చర్యలు తీసుకునేందుకు ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కేసీయార్ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి జైలులో పెట్టేస్తే హ్యాపీగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేయచ్చు కదా ? మరింకా ఎందుకు వెనకాడుతున్నారు ?

This post was last modified on August 18, 2022 3:49 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

2 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

2 hours ago

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

2 hours ago

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

3 hours ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

3 hours ago

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో…

3 hours ago