Political News

కేసీఆర్ మీద కేసు పెట్టే ధైర్యముందా?

ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేయాలి ? ఆ ఆరోపణలపై అధ్యయనం చేయాలి. అవినీతి జరిగిందని అనుమానమొస్తే శాఖాపరమైన విచారణ జరిపించాలి. అవినీతి నిర్ధారణైతే వెంటనే సదరు వ్యక్తిపై కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాలి. మామూలుగా జరిగే విధానమిదే. మరిప్పుడు అలాంటిదేమీ లేకుండా డైరెక్టుగా సంబంధిత శాఖ మంత్రే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఏమి చేయాలి ? వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి.

మరిపుడు కేసీయార్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేంత ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా ? అన్నదే కీలకమైన ప్రశ్న. ఇపుడిదంతా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టీఆర్ఎస్ అవినీతి హద్దులన్నీ దాటేసిందని మంత్రి మండిపోయారు. ప్రాజెక్టుకు చట్టబద్దమైన అనుమతులు తీసుకోకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాలు చేసేసినట్లు మంత్రి ఆరోపించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. మొన్నటి భారీ వర్షాలు, వరద కారణంగా పంపులు ముణిగిపోయాయని చెప్పి మరి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని రెచ్చిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రే ధృవీకరించినాక కేసీయార్ పై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ లేదా ఈడీ ద్వారా కేసులు నమోదు చేయవచ్చు కదా ? అవినీతి జరిగిందని చెబుతున్నారంటే షెకావత్ దగ్గర అన్నీ ఆధారాలున్నట్లే అనుకోవాలి.

తన దగ్గరున్న ఆధారాలతో కేసీఆర్ పైన కేసు పెట్టి అరెస్టు చేయించచ్చుకదా ? ఇంకా ఎందుకు షెకావత్ కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నారు. తన శాఖ పరిధిలోనే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్దారణైతే చర్యలు తీసుకునేందుకు ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కేసీయార్ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి జైలులో పెట్టేస్తే హ్యాపీగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేయచ్చు కదా ? మరింకా ఎందుకు వెనకాడుతున్నారు ?

This post was last modified on August 18, 2022 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago