ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోటరీ-ఈ మాట వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది పచ్చినిజం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క ఒక్క అడుగు ముందుకు వేసి.. తనకు అనుకూలంగా ఉండేవారిని మంత్రి పదవుల్లో నియమించుకున్నారు. తర్వాత.. కీలక బాధ్యతలు అప్పగించారు. ఏ ఒక్కరైనా తనకు వ్యతిరేకంగా స్వరం విప్పుతారని కానీ.. ఎవరైనా.. తనకు ఎదురు తిరుగుతారని.. కానీ భావిస్తే.. ముందుగానే వారిని ఏరివేసే క్రతువును ప్రారంభించారు. ఇలా ఇప్పటికే చాలా మందిని ఆయన తప్పించారు.
ఇప్పుడు ఈ జాబితాలో కేంద్ర మంత్రి గడ్కరీ సహా.. పలువురు చేరిపోయారు. దీంతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. కొన్నాళ్ల కిందట.. గడ్కరీ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు చూస్తే.. విరక్తి పుడుతోందని అన్నారు. ఆయన అన్న కాంటెస్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే.. అప్పట్లో సైలెంట్గా ఉన్న మోడీ.. ఇప్పుడు ఆయనకు షాక్ ఇచ్చారు. మోడీకి అనునిత్యం అండగా ఉండే.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీకి ఉద్వాసన పలికారు.
అదేసమయంలో మరికొంతమందిని తీసుకున్నారు. వీరిలో మోడీకి విధేయుడిగా పేర్కొన్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్ సహా ఓం మాథూర్, సుధా యాదవ్ ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, షాహన్వాజ్ హుస్సేన్కు బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. ఇక్బాల్ సింగ్ లాల్పుర, సత్యనారాయణ జతియా, కే లక్ష్మణ్ను బోర్డులోకి తీసుకున్నారు.
అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. కొత్త వారితో కలిపిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం. దీనిని బట్టి.. మోడీకి విధేయులుగా ఉంటే చాలు.. ఏదైనా సాధ్యమే అనే వ్యాఖ్యలు పార్టీలోనే వినిపిస్తున్నాయి.
This post was last modified on August 18, 2022 10:33 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…