Political News

మోడీ కోట‌రీలో అనూహ్య మార్పు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కోట‌రీ-ఈ మాట వినేందుకు ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది ప‌చ్చినిజం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక్క ఒక్క అడుగు ముందుకు వేసి.. త‌న‌కు అనుకూలంగా ఉండేవారిని మంత్రి ప‌ద‌వుల్లో నియ‌మించుకున్నారు. త‌ర్వాత‌.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఏ ఒక్క‌రైనా త‌న‌కు వ్య‌తిరేకంగా స్వ‌రం విప్పుతార‌ని కానీ.. ఎవ‌రైనా.. త‌న‌కు ఎదురు తిరుగుతార‌ని.. కానీ భావిస్తే.. ముందుగానే వారిని ఏరివేసే క్ర‌తువును ప్రారంభించారు. ఇలా ఇప్ప‌టికే చాలా మందిని ఆయ‌న త‌ప్పించారు.

ఇప్పుడు ఈ జాబితాలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ స‌హా.. ప‌లువురు చేరిపోయారు. దీంతో వారిని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. గ‌డ్క‌రీ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌స్తుత రాజ‌కీయాలు చూస్తే.. విర‌క్తి పుడుతోంద‌ని అన్నారు. ఆయ‌న అన్న కాంటెస్ట్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో సైలెంట్గా ఉన్న మోడీ.. ఇప్పుడు ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. మోడీకి అనునిత్యం అండ‌గా ఉండే.. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి గ‌డ్క‌రీకి ఉద్వాస‌న ప‌లికారు.

అదేస‌మ‌యంలో మరికొంతమందిని తీసుకున్నారు. వీరిలో మోడీకి విధేయుడిగా పేర్కొన్న‌ కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్‌, భూపేంద్ర యాదవ్‌ సహా ఓం మాథూర్‌, సుధా యాదవ్ ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, షాహన్‌వాజ్‌ హుస్సేన్‌కు బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. ఇక్బాల్ సింగ్‌ లాల్‌పుర, సత్యనారాయణ జతియా, కే లక్ష్మణ్‌ను బోర్డులోకి తీసుకున్నారు.

అదేవిధంగా బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో కూడా మార్పులు చేశారు. కొత్త వారితో కలిపిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సభ్యులుగా ఉన్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం. దీనిని బ‌ట్టి.. మోడీకి విధేయులుగా ఉంటే చాలు.. ఏదైనా సాధ్య‌మే అనే వ్యాఖ్య‌లు పార్టీలోనే వినిపిస్తున్నాయి.

This post was last modified on August 18, 2022 10:33 am

Share

Recent Posts

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

47 seconds ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

5 minutes ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago