Political News

మోడీ కోట‌రీలో అనూహ్య మార్పు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కోట‌రీ-ఈ మాట వినేందుకు ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది ప‌చ్చినిజం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక్క ఒక్క అడుగు ముందుకు వేసి.. త‌న‌కు అనుకూలంగా ఉండేవారిని మంత్రి ప‌ద‌వుల్లో నియ‌మించుకున్నారు. త‌ర్వాత‌.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఏ ఒక్క‌రైనా త‌న‌కు వ్య‌తిరేకంగా స్వ‌రం విప్పుతార‌ని కానీ.. ఎవ‌రైనా.. త‌న‌కు ఎదురు తిరుగుతార‌ని.. కానీ భావిస్తే.. ముందుగానే వారిని ఏరివేసే క్ర‌తువును ప్రారంభించారు. ఇలా ఇప్ప‌టికే చాలా మందిని ఆయ‌న త‌ప్పించారు.

ఇప్పుడు ఈ జాబితాలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ స‌హా.. ప‌లువురు చేరిపోయారు. దీంతో వారిని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. గ‌డ్క‌రీ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌స్తుత రాజ‌కీయాలు చూస్తే.. విర‌క్తి పుడుతోంద‌ని అన్నారు. ఆయ‌న అన్న కాంటెస్ట్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో సైలెంట్గా ఉన్న మోడీ.. ఇప్పుడు ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. మోడీకి అనునిత్యం అండ‌గా ఉండే.. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి గ‌డ్క‌రీకి ఉద్వాస‌న ప‌లికారు.

అదేస‌మ‌యంలో మరికొంతమందిని తీసుకున్నారు. వీరిలో మోడీకి విధేయుడిగా పేర్కొన్న‌ కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్‌, భూపేంద్ర యాదవ్‌ సహా ఓం మాథూర్‌, సుధా యాదవ్ ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, షాహన్‌వాజ్‌ హుస్సేన్‌కు బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. ఇక్బాల్ సింగ్‌ లాల్‌పుర, సత్యనారాయణ జతియా, కే లక్ష్మణ్‌ను బోర్డులోకి తీసుకున్నారు.

అదేవిధంగా బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో కూడా మార్పులు చేశారు. కొత్త వారితో కలిపిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సభ్యులుగా ఉన్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం. దీనిని బ‌ట్టి.. మోడీకి విధేయులుగా ఉంటే చాలు.. ఏదైనా సాధ్య‌మే అనే వ్యాఖ్య‌లు పార్టీలోనే వినిపిస్తున్నాయి.

This post was last modified on August 18, 2022 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…

23 minutes ago

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు…

1 hour ago

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్…

3 hours ago

క్యామియోల కోసం జైలర్ 2 తిప్పలు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి…

3 hours ago

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది…

4 hours ago

ఫ్లాప్ సినిమాలు గుర్తు చేసుకోవడం అవసరమా

ఇవాళ అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీకి రాకా టైటిల్ అనౌన్స్ చేసి ప్రీ లుక్  పోస్టర్ వదిలిన…

5 hours ago