Political News

ఉచిత ప‌థ‌కాలు.. పార్టీల ఇష్ట‌మే: సుప్రీం కోర్టు

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌కు/ ఓట‌ర్ల‌కు ఇచ్చే ఉచిత ప‌థ‌కాల హామీలు.. సంక్షేమ ప‌థ‌కాల వాగ్దానాల‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. ప్రజలకు సంక్షేమాన్ని అందజేయవలసిన కర్తవ్యం ప్రభుత్వాలకు ఉందని చెప్పారు. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణలో తమ వాదనలను కూడా వినాలని త‌మిళ‌నాడు అధికార ప‌క్షం డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఎన్నికల ప్రచారంలో ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వడాన్ని అనుమతించకుండా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు చాలా సంక్లిష్టమవుతున్నాయని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై విచారణలో తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే సుప్రీంకోర్టును కోరాయి.

ఏది ఉచితం.. ఏది సంక్షేమం?

సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఏది ఉచిత తాయిలం? ఏది కాదు? ఏది సంక్షేమ కార్య‌క్ర‌మం అనే అంశం చాలా సంక్లిష్టమవుతోందన్నారు. హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని చెప్పారు. ఏవి సరైన హామీలు? అనేదే ప్రశ్న అని అన్నారు. ఉచిత విద్యను తాయిలం అని అనగలమా? అన్నారు. ఉచిత తాగునీరు, కనీస స్థాయిలో విద్యుత్తును ఉచితంగా అందజేయడాన్ని తాయిలంగా చెప్పగలమా? అని ప్ర‌శ్నించారు. వినియోగదారుల ఉత్పత్తులు, ఉచిత ఎలక్ట్రానిక్స్ పరికరాలను సంక్షేమంగా వర్ణించగలమా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి ఏది సరైన మార్గం? అనేదే ప్రస్తుత చర్చనీయాంశమని సీజేఐ అన్నారు. డబ్బు వృథా అవుతోందని కొందరు అంటారని, అది సంక్షేమమని మరికొందరు అంటారని అన్నారు. ఈ విషయాలు రాన్రానూ జటిలమవుతున్నాయన్నారు… మీరు మీ అభిప్రాయాలను చెప్పండి, చర్చించి, ఆలోచించి, నిర్ణయిస్తాం.. అని చెప్పారు.

రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు మాత్రమే అవి ఎన్నికల్లో గెలవడానికి ప్రాతిపదిక కాబోవని చెప్పారు. దీనికి ఉదాహరణ గ్రామీణ ఉపాధి హామీ పథకమని చెప్పారు. ఈ పథకం ప్రజలకు హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించిందన్నారు. ఓటర్లకు హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడం లేదన్నారు. మొత్తంగా చూస్తే.. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయ కోణంలో చూడ‌లేమ‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 17, 2022 11:12 pm

Share

Recent Posts

సాయిపల్లవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…

3 minutes ago

జూలై నెలాఖరు… జోష్ ఎలా ఉంది గురు

జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను…

7 minutes ago

మళ్ళీ పేపర్ లీక్ అయిందా సారూ…

పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు.  కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం…

28 minutes ago

ఇకపై వందేమాతరం పాడేటప్పుడు ఇవి చెయ్యకూడదు

నిత్యం పాఠ‌శాలల్లోనూ.. జాతీయ పండుగ‌ల దినాల్లోనూ అంద‌రూ క‌ల‌సి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక‌, చ‌ట్ట‌బ‌ద్ధం కానుంది. దీనికి…

1 hour ago

ప‌రామ‌ర్శ‌ల‌తో `పోయేది` చాలానే ఉంది… జ‌గ‌న్‌.. !

ప‌రామ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. పార్టీని కాపాడుకోవ‌డ‌మూ త‌ప్పుకాదు. కానీ, ఎవ‌రిని పరామ‌ర్శించాలన్న విష‌యంలోనే పార్టీలు విజ్ఞ‌త‌తో ముందుకు సాగాలి. ఈ…

2 hours ago

కొత్త కుర్రాడి మీద కామెంట్స్ ఏంటి

భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో…

2 hours ago