ఎవరు ఔనన్నా.. కాదన్నా..ఏపీలో సంక్షేమ పథకాలు.. ఉచిత పథకాలను విస్మరించే ప్రయత్నం కానీ.. సాహసం కానీ.. ఏ ఒక్క పార్టీ చేసే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అయితే.. ఏకంగా.. సంక్షేమాన్నే ఎన్నికల మంత్రంగా పఠిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేకున్నా.. తమను తమ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలే ఆదరిస్తాయనే విధంగా సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వేల కోట్ల అప్పులు చేసి మరీ.. పథకాలు అమలు చేస్తున్నారు.
అయితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం సంక్షేమం మాటున ఉచిత పథకాలు అమలు చేయడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతోంది. సంక్షేమ పథకాల్లో కోతలు విధించాలని.. ప్రజల నుంచి పన్నులు మరింత పిండాలని.. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. ఇదే విషయాన్ని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు.. ఉచిత పథకాలకు తేడా లేదా? అనేది బీజేపీ యేతర పార్టీలు ఉన్న ప్రభుత్వాలు చెబుతున్న మాట.
అయితే.. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా వ్యాఖ్యానించినా.. ఏపీ సీఎం కానీ.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కానీ.. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా.. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే.. ప్రధాన అజెండాగా ఈ రెండు పార్టీలు కూడా.. ముందుకు సాగనున్నాయి. సంక్షేమాన్ని విస్మరించి.. ఏ పార్టీ కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయలేవు. ఈ క్రమంలో కేంద్రంలోని మోడీని ఎవరు మెప్పిస్తారు? అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్రానికి ఇస్తున్న గ్రాంట్లను కేంద్రం నిలిపి వేసింది. అంతేకాదు. ఇస్తున్న ప్రతి రూపాయికి కూడా లెక్కలు అడుగుతోంది. కొనసాగాల్సిన పథకాలకు కూడా రూపాయి అదనంగా ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు ఒకవైపు.. ఏపీని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మరోవైపు.. అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు తీసేయాలని మోడీ ఆదేశిస్తే.. ఏం చేయాలనేది అంతుబట్టని విషయంగా మారిపోయింది. ఈ క్రమంలో మోడీకి వ్యతిరేకంగా.. గళం విప్పుతారా? లేక.. సర్దుకుపోతారా? అనేది చూడాలి.
This post was last modified on August 17, 2022 7:48 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…