Modi
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం చివరకు నరేంద్రమోడీ మెడకు చుట్టుకుంటోంది. ముఖ్యమైన దినోత్సవాల్లో జైలులో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగున్న వారిలో కొందరిని విడుదల చేయటం సహజంగా జరిగేదే. ఈ పద్దతిలోనే ఆజాదీకీ అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీల్లో కొందరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. అయితే ఏ రాష్ట్రంలోను లేనివిధంగా గుజరాత్ రాష్ట్రంలో విడుదలైన కొందరు ఖైదీల విషయంలోనే గోల పెరిగిపోతోంది. పైగా ఆ గోలంతా మోడీ మెడకు చుట్టుకుంటోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ లోని గోద్రా సబ్ జైలు నుంచి 11 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరి నేపథ్యం ఏమిటంటే హత్యలు, మహిళాలపై వేధింపుల కారణంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారందరినీ గుజరాత్ ప్రభుత్వం ఏరికోరి విడుదల చేయించింది. దీంతో ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2002 గోద్రా అల్లర్ల నేపథ్యంలో బిల్కిస్ బానో అనే మహిళ ఇంటి మీద అల్లరిమూకలు దాడి చేశాయి. ఆ దాడుల నుండి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ఇరుగుపొరుగు వారితో కలిసి బానో కూడా తప్పించుకుంది.
ఇంటినుండి తప్పించుకునేటప్పటికి బానో ఐదు నెలల గర్భవతి. తనిద్దరు పిల్లలతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు, ఇతరులతో ఆమె ఊరికి ఆనుకునున్న పంటపొలాల్లోకి వెళ్ళి దాక్కుంది. అయితే అల్లరిమూకలు వీళ్ళని వెంటాడి పట్టుకున్నారు. అందరిముందే బానోను సామూహికంగా అత్యాచారం చేశారు. బానో కుటుంబసభ్యుల్లో ఏడుగురిని హత్యచేశారు. అలాగే మరికొందరిని కూడా చంపేశారు. అల్లర్ల వేడి తగ్గిన తర్వాత బానో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదు. గోద్రాలోని ఏ పోలీసుస్టేషన్లోను బానో ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయలేదు.
తర్వాత కోర్టుకే నేరుగా ఫిర్యాదు చేయడం, సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసుకట్టారు. తర్వాత చాలాకాలం పాటు విచారణలు జరిగి చివరకు కొందరిని అరెస్టు చేశారు. వీరిలో 11 మందిని దోషులుగా తేల్చిన కోర్టు కొందరిపై సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసింది. అలా జైలులో ఉంటున్న 11 మందిని ఇపుడు గుజరాత్ ప్రభుత్వం విడుదలచేసింది. స్పెషల్ రిలీజ్ పాలసీ కింద రేపిస్టులు, పథకం ప్రకారం దాడులుచేసి హత్యలుచేసే వాళ్ళని వదలకూడదని ఉంది. అయినా ఆ నిబంధనను ప్రభుత్వం పట్టించుకోకుండా రిలీజ్ చేయటంతోనే గొడవలు మొదలయ్యాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…