తొందరలోనే జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటమన్నది ఇటు బీజేపీకి అటు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఎంపిగా, ఎంఎల్ఏగా గెలుస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు పార్టీ కన్నా తామే గొప్పోళ్ళమనే ఫీలింగ్ చాలావుంది. తాము లేకపోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో, మునుగోడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని బలమైన ఫీలింగుంది.
ఈ ఫీలింగుతోనే రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరి మళ్ళీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇపుడు సమస్య ఏమిటంటే రేపటి ఉపఎన్నికలో రాజగోపాల్ గనుక గెలవకపోతే బీజేపీలో పరువు పోవడం ఖాయం. అందుకనే మొత్తం బీజేపీ టీమును మునుగోడులో క్యాంపు వేయిస్తున్నారు. ఈనెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ అమిత్ షా బహిరంగ సభ జరగబోతోంది మునుగోడులో.
ఈ నేపధ్యంలోనే కమలం టీమ్ మొత్తాన్ని నియోజకవర్గంలోనే క్యాంపు వేయించాలని డిసైడ్ అయ్యారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తదితరులంతా వీళ్ళతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఈ నెల నుండి ఉప ఎన్నిక అయిపోయేంత వరకు నియోజకవర్గంలోనే క్యాంపు వేయబోతున్నారు. దీన్నిబట్టే ఉపఎన్నికలో గెలుపును కమలం పార్టీ నేతలు ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. ఎన్నికల నిర్వహణ వ్యవహారం మొత్తాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చూసుకుంటున్నారు.
అలాగే ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి ఆకర్షించే బాధ్యతలన్నీ ఈటల రాజేందర్ కు అప్పగించారు. మద్దతుదారులను సమీకరించటం, ఇంటింటి ప్రచార బాధ్యతలను రాజగోపాలరెడ్డి చూసుకోబోతున్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించే బాధ్యత వివేక్ కు అప్పటించారు. ఫైనల్ గా ప్రచార బాధ్యతలు, రోడ్డుషోలు, చిన్న చిన్న సమావేశాలను పార్టీ చీఫ్ బండి సంజయ్ చూసుకోబోతున్నారు. ఇక ఎన్నికల కమిటి నిర్ణయించిన ప్రకారం మిగిలిన నేతలంతా పై కీలకనేతలకు సహకరిస్తారు. మొత్తానికి మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ ఇంత కష్టపడలేదేమో అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.
This post was last modified on August 17, 2022 1:43 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…