Political News

మునుగోడులోనే మకాం వేయబోతున్నారా?

తొందరలోనే జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటమన్నది ఇటు బీజేపీకి అటు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఎంపిగా, ఎంఎల్ఏగా గెలుస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు పార్టీ కన్నా తామే గొప్పోళ్ళమనే ఫీలింగ్ చాలావుంది. తాము లేకపోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో, మునుగోడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని బలమైన ఫీలింగుంది.

ఈ ఫీలింగుతోనే రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరి మళ్ళీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇపుడు సమస్య ఏమిటంటే రేపటి ఉపఎన్నికలో రాజగోపాల్ గనుక గెలవకపోతే బీజేపీలో పరువు పోవడం ఖాయం. అందుకనే మొత్తం బీజేపీ టీమును మునుగోడులో క్యాంపు వేయిస్తున్నారు. ఈనెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ అమిత్ షా బహిరంగ సభ జరగబోతోంది మునుగోడులో.

ఈ నేపధ్యంలోనే కమలం టీమ్ మొత్తాన్ని నియోజకవర్గంలోనే క్యాంపు వేయించాలని డిసైడ్ అయ్యారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తదితరులంతా వీళ్ళతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఈ నెల నుండి ఉప ఎన్నిక అయిపోయేంత వరకు నియోజకవర్గంలోనే క్యాంపు వేయబోతున్నారు. దీన్నిబట్టే ఉపఎన్నికలో గెలుపును కమలం పార్టీ నేతలు ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. ఎన్నికల నిర్వహణ వ్యవహారం మొత్తాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చూసుకుంటున్నారు.

అలాగే ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి ఆకర్షించే బాధ్యతలన్నీ ఈటల రాజేందర్ కు అప్పగించారు. మద్దతుదారులను సమీకరించటం, ఇంటింటి ప్రచార బాధ్యతలను రాజగోపాలరెడ్డి చూసుకోబోతున్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించే బాధ్యత వివేక్ కు అప్పటించారు. ఫైనల్ గా ప్రచార బాధ్యతలు, రోడ్డుషోలు, చిన్న చిన్న సమావేశాలను పార్టీ చీఫ్ బండి సంజయ్ చూసుకోబోతున్నారు. ఇక ఎన్నికల కమిటి నిర్ణయించిన ప్రకారం మిగిలిన నేతలంతా పై కీలకనేతలకు సహకరిస్తారు. మొత్తానికి మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ ఇంత కష్టపడలేదేమో అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.

This post was last modified on August 17, 2022 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago