కాలం కంటే శక్తివంతమైనది మరొకటి ఉండదు. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వారు సైతం కాల మహిమతో తర్వాతి కాలంలో ఎదురయ్యే సవాళ్లకు చేష్టలుడిగిపోతారు. అప్పటివరకు వీర విధేయులుగా ఉన్నవారు సైతం ముఖం చాటేస్తుంటారు. ఇదంతా కాలమహిమ అనకుండా ఉండలేం. పదేళ్ల పాటు దేశాన్ని తన కంటిచూపుతో శాసించి.. ‘రిమోట్’ అనే పదానికి అసలుసిసలు అర్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు కాంగ్రెస్ తప్పించి మరే పార్టీ కనుచూపు మేరలో లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి.. ఈ రోజున అత్యంత బేలతనాన్ని మూటకట్టుకొని.. ఇంకెప్పటికైనా పూర్వ వైభవాన్ని ప్రదర్శించగలమా? అన్న పరిస్థితి. ఇదంతా ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని అధినేత్రిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీకి డబుల్ షాక్ తగిలింది. రెండు షాకుల్ని ఆమెకు ఒకే నేత ఇవ్వటం.. అతగాడు ఆమె ప్రత్యేక టీంలో కీలకభూమిక పోషించిన నేత కావటమే. అవును.. పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తాజాగా ఆమెకు దిమ్మ తిరిగే షాకిచ్చారు.
ఆయన్నుజమ్ముకశ్మీర్ లో పార్టీప్రచార కమిటీ సారథిగానియమిస్తూ తీసుకున్ననిర్ణయాన్ని ఆయన విభేదించారు. ఆ బాధ్యత తీసుకునేందుకు నిరాకరించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం ఆయన రాజీనామా చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియటం.. దాన్ని కొనసాగించేందుకు సోనియాగాంధీ ఆసక్తి చూపించకపోవటంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు జమ్ముకశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో ఆ బాధ్యతను ఆయనకు అప్పగించింది. అయితే.. దీన్ని అజాద్..డిమోషన్ గా భావించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే తాను అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉంటే.. దానికి బదులుగా తన పరిధిని తగ్గిస్తూ.. జమ్మూ కశ్మీర్ కు పరిమితం చేయాలని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తనకు సన్నిహితంగా ఉండే గులామ్ అహ్మద్ మిర్ ను రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించటం పైనా గుర్రుగా ఉన్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తనకు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ‘రాజీనామా’ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామం సోనియాగాంధీకి ఇబ్బందిని కలిగించేదిగా చెబుతున్నారు. మరి.. దీనిపై సోనియాగాంధీ ఏరీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…