మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టినట్లులేదు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మాట్లాడుతు రాజధాని స్ధాయిలో పరిపాలనా వికేంద్రీకరణే తమ విధానంగా చెప్పారు. ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతాల ఆత్మగౌరవానికి మూడురాజధానుల ఏర్పాటే పునాదిగా జగన్ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి చాలాకాలంగా పక్కనపెట్టేశారు. ఎప్పుడైతే హైకోర్టు జగన్ ప్రతిపాదనను అడ్డుకుందో అప్పటినుండి ప్రభుత్వం ఈ విషయంపై పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు.
హైకోర్టు జగన్ ప్రతిపాదనను కొట్టేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడినపుడు సమగ్ర బిల్లును మళ్ళీ తీసుకొస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనపై ఎలాంటి కదలిక లేకపోవటంతో ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయిందని చాలామంది అనుకున్నారు. అయితే తాజా ప్రకటన విన్న తర్వాత జగన్ ఆలోచనల్లోనుండి మూడు రాజధానుల అంశం తొలగిపోలేదన్న విషయం అర్ధమైపోతోంది. ఇదే సమయంలో వీలైనంత తొందరలో తన క్యాంపాఫీసును వైజాగ్ కు తీసుకెళిపోతారనే ప్రచారం మొదలైంది.
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పనిచేస్తే అక్కడే క్యాంపాఫీసుగా అనుకోవాలి. మూడు రాజధానుల ఏర్పాటును అయితే హైకోర్టు అడ్డుకున్నది కానీ సీఎంను పలానా చోటే కూర్చుని పనిచేయాలని ఏ కోర్టు కూడా చెప్పలేదు. ఈ పద్దతిలోనే జగన్ తొందరలోనే విశాఖపట్నం వెళిపోతారనే ప్రచారం ఊపందుకుంటోంది. అదే జరిగితే తన ఆలోచనను పరోక్షంగా పాక్షికంగా జగన్ సాకారం చేసుకున్నట్లే అనుకోవాలి. పూర్తిస్ధాయిలో పరిపాలనా రాజధానిని విశాఖపట్నంకు తీసుకెళ్ళలేకపోయిన జగన్ కేవలం తన క్యాంప్ ఆఫీసును మాత్రమే తీసుకెళ్ళినట్లవుతుంది.
మొత్తం మీద జగన్ తన మనసులోని ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బయటపెట్టినట్లయ్యింది. ఆలోచనను అయితే బయటపెట్టారు కానీ కార్యాచరణ రూపంలో ఎప్పుడు చూపిస్తారనేది సస్పెన్సుగా మారింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆలోచనలకు జగన్ పదునుపెట్టడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో లబ్ది జరుగుతుందని అనుకుంటే కచ్చితంగా మూడు రాజధానుల అంశాన్ని ఏదోరూపంలో అమల్లోకి తీసుకురావటానికే ప్రయత్నిస్తారనటంలో సందేహంలేదు. కాకపోతే అది వాస్తవంలో సాధ్య పడుతుందో లేదో ఎవరూ చెప్పలేరు.
This post was last modified on August 16, 2022 7:17 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…