అప్పుడెప్పుడో విజన్ 2020 అంటూ నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు.. భవిష్యత్తును ఎలా చూడాలన్న దానిపై ఆయనకున్న విజన్ ను బయటపెట్టింది. నిజానికి చాలా దూరంగా ఆలోచించి.. రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన చంద్రబాబును అప్పట్లో చాలామంది ఎక్కెసం చేసేవారు. కానీ.. ఆయన అప్పటి విజన్ 2020ను ఫాలో అయి ఉంటే.. ఈ రోజున తెలుగు రాష్ట్రాలు మరో లెవల్ లో ఉండేవి. ఫ్యూచర్ ను ఎంతో ముందుగా మదింపు చేసే విషయంలో చంద్రబాబు విజన్ ను ఎవరూ తప్పు పట్టలేరు.
ఐటీ బూమ్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లు హైదరాబాద్ ను సిద్ధం చేసిన ఆయన విజన్ కారణంగా.. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు ఉందంటే.. అది ఐటీ పుణ్యమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే వజ్రోత్సవాల వేళ.. టీడీపీ అధినేత నోటి నుంచి సరికొత్త ప్రతిపాదన వచ్చింది. రానున్న 25 ఏళ్లకు విజన్ 2047 పేరుతో సరికొత్త లక్ష్యాల్ని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఆ లక్ష్యంతో పని చేయాలంటూ ఆయన తన మనసులోని ఆలోచనల్ని పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని.. డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. పేదల అభ్యున్నతికి పని చేయాలన్న ఆశయంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పటికి టీడీపీ అదే లక్ష్యం కోసం పోరాడుతుందన్నారు. ఇక.. తన విజన్ 2047కు సంబంధించి పది కీలక అంశాల్ని ఆయన పంచుకున్నారు. అవేమంటే..
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…