అప్పుడెప్పుడో విజన్ 2020 అంటూ నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు.. భవిష్యత్తును ఎలా చూడాలన్న దానిపై ఆయనకున్న విజన్ ను బయటపెట్టింది. నిజానికి చాలా దూరంగా ఆలోచించి.. రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన చంద్రబాబును అప్పట్లో చాలామంది ఎక్కెసం చేసేవారు. కానీ.. ఆయన అప్పటి విజన్ 2020ను ఫాలో అయి ఉంటే.. ఈ రోజున తెలుగు రాష్ట్రాలు మరో లెవల్ లో ఉండేవి. ఫ్యూచర్ ను ఎంతో ముందుగా మదింపు చేసే విషయంలో చంద్రబాబు విజన్ ను ఎవరూ తప్పు పట్టలేరు.
ఐటీ బూమ్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లు హైదరాబాద్ ను సిద్ధం చేసిన ఆయన విజన్ కారణంగా.. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు ఉందంటే.. అది ఐటీ పుణ్యమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే వజ్రోత్సవాల వేళ.. టీడీపీ అధినేత నోటి నుంచి సరికొత్త ప్రతిపాదన వచ్చింది. రానున్న 25 ఏళ్లకు విజన్ 2047 పేరుతో సరికొత్త లక్ష్యాల్ని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఆ లక్ష్యంతో పని చేయాలంటూ ఆయన తన మనసులోని ఆలోచనల్ని పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని.. డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. పేదల అభ్యున్నతికి పని చేయాలన్న ఆశయంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పటికి టీడీపీ అదే లక్ష్యం కోసం పోరాడుతుందన్నారు. ఇక.. తన విజన్ 2047కు సంబంధించి పది కీలక అంశాల్ని ఆయన పంచుకున్నారు. అవేమంటే..
This post was last modified on August 15, 2022 10:12 pm
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…