అప్పుడెప్పుడో విజన్ 2020 అంటూ నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు.. భవిష్యత్తును ఎలా చూడాలన్న దానిపై ఆయనకున్న విజన్ ను బయటపెట్టింది. నిజానికి చాలా దూరంగా ఆలోచించి.. రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన చంద్రబాబును అప్పట్లో చాలామంది ఎక్కెసం చేసేవారు. కానీ.. ఆయన అప్పటి విజన్ 2020ను ఫాలో అయి ఉంటే.. ఈ రోజున తెలుగు రాష్ట్రాలు మరో లెవల్ లో ఉండేవి. ఫ్యూచర్ ను ఎంతో ముందుగా మదింపు చేసే విషయంలో చంద్రబాబు విజన్ ను ఎవరూ తప్పు పట్టలేరు.
ఐటీ బూమ్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లు హైదరాబాద్ ను సిద్ధం చేసిన ఆయన విజన్ కారణంగా.. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు ఉందంటే.. అది ఐటీ పుణ్యమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే వజ్రోత్సవాల వేళ.. టీడీపీ అధినేత నోటి నుంచి సరికొత్త ప్రతిపాదన వచ్చింది. రానున్న 25 ఏళ్లకు విజన్ 2047 పేరుతో సరికొత్త లక్ష్యాల్ని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఆ లక్ష్యంతో పని చేయాలంటూ ఆయన తన మనసులోని ఆలోచనల్ని పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని.. డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. పేదల అభ్యున్నతికి పని చేయాలన్న ఆశయంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పటికి టీడీపీ అదే లక్ష్యం కోసం పోరాడుతుందన్నారు. ఇక.. తన విజన్ 2047కు సంబంధించి పది కీలక అంశాల్ని ఆయన పంచుకున్నారు. అవేమంటే..
This post was last modified on August 15, 2022 10:12 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…