Political News

మునుగోడుకు ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్

ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. అయినప్పటికి మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెరుగుతున్న డిమాండ్ ఏమిటంటే ఇళ్ళకు, పంటపొలాలకు, ప్రచార రథాలకు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే జనాలకు, ప్రింటింగ్ ప్రెస్సులకు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మహా అయితే ఉపఎన్నికకు మరో నాలుగు నెలల వ్యవధి ఉంది.

ఉపఎన్నికలో గెలవటం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. దాంతో పార్టీలు తమ శక్తియుక్తులన్నింటినీ నియోజకవర్గంలోనే కేంద్రీకరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ప్రచారం చేసుకోవాలంటే పార్టీ ఆఫీసులు తెరవాలికదా. ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు బస, వసతి చూడాలి కదా. ఇవన్నీ ఎవరు చూడాలంటే అభ్యర్ధే చూడాలి. ఎందుకంటే అవసరం పార్టీలకు ఎంతవసరమో అభ్యర్ధులకీ అంతే అవసరం కాబట్టి.

అందుకనే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి వీలైనన్ని ఇళ్ళను అద్దెలకు తీసేసుకుంటున్నారు. తన మద్దతుదారుల కోసం రాజగోపాల్ ఇప్పటికే చౌటుప్పల్, మునుగోడు హెడ్ క్వార్టర్స్ లో 15 ఇళ్ళను అద్దెకు తీసేసుకున్నారట. డిమాండును దృష్టిలో పెట్టుకుని యజమానులు అద్దెలను కూడా బాగా పెంచేస్తున్నారట. రు. 10 వేలున్న డబల్ బెడ్ రూం ఇల్లు ఇపుడు రు. 20 వేలు చెబుతున్నారట.

ఇక కమర్షియల్ గా సింగిల్ షట్టర్ ఉన్న గది అద్దె 10 వేల నుండి 15 వేల రూపాయలు చెబుతున్నారట. అలాగే ప్రచార సామగ్రి తయారుచేసే వాళ్ళకు కూడా ఫుల్లుగా డిమాండ్ పెరిగిపోతోందట. ఇక రైతులు అయితే తమ పొలాలను అద్దెలకు ఇస్తున్నారట. బహిరంగసభలు నిర్వహించాలంటే కనీసం 20 ఎకరాలు అవసరం. ప్రతిపార్టీ కనీసం ఐదు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దాంతో రైతులు ఎకరాకు ఇంతాని డబ్బులు మొత్తాన్ని ముందుగానే తీసేసుకుంటున్నారట. పార్టీలతో పొలాలను కొంతకాలానికి లీజుకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారట. మొత్తానికి ఉపఎన్నిక పుణ్యమాని అంతా డిమాండ్ పెరిగిపోతోంది.

This post was last modified on August 15, 2022 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీలో టెన్ష‌న్‌… వివేకా కేసు ఏమ‌వుతుంది?

వైసీపీలో తొలిసారి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసుపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ కేసు ఏమ‌వుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయ‌డం…

36 minutes ago

అత్యాశకు పోతే అయిదు లక్షలు వచ్చింది

రాను రాను రీ రిలీజులు చాలా రిస్కీ వ్యవహారాలుగా మారిపోతున్నాయి. ఏది వర్కౌట్ అవుతుందో ఏది పోతుందో ముందే పసిగట్టడంలో…

42 minutes ago

లోకల్ ఛానెల్లో ‘జననాయగన్’

పైరసీలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి…

2 hours ago

డెకాయిట్ దోచుకోవాల్సింది ఇంకా ఉంది

మొన్న శుక్రవారం విడుదలైన డెకాయిట్ స్లో అండ్ స్టడీగా ఉంది. టాక్ డీసెంట్ గా ఉండటం, ప్రమోషన్లు జనాలకు చేరడం,…

3 hours ago

సర్వేలో షాకులు… బాబు ఏం చేస్తారు?

ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు…

3 hours ago

హైడ్రాకి బ్రేకులు వేసిన హైకోర్టు

తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న `హైడ్రా` వ్య‌వ‌స్థ‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండానే…

4 hours ago