Political News

మునుగోడుకు ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్

ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. అయినప్పటికి మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెరుగుతున్న డిమాండ్ ఏమిటంటే ఇళ్ళకు, పంటపొలాలకు, ప్రచార రథాలకు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే జనాలకు, ప్రింటింగ్ ప్రెస్సులకు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మహా అయితే ఉపఎన్నికకు మరో నాలుగు నెలల వ్యవధి ఉంది.

ఉపఎన్నికలో గెలవటం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. దాంతో పార్టీలు తమ శక్తియుక్తులన్నింటినీ నియోజకవర్గంలోనే కేంద్రీకరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ప్రచారం చేసుకోవాలంటే పార్టీ ఆఫీసులు తెరవాలికదా. ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు బస, వసతి చూడాలి కదా. ఇవన్నీ ఎవరు చూడాలంటే అభ్యర్ధే చూడాలి. ఎందుకంటే అవసరం పార్టీలకు ఎంతవసరమో అభ్యర్ధులకీ అంతే అవసరం కాబట్టి.

అందుకనే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి వీలైనన్ని ఇళ్ళను అద్దెలకు తీసేసుకుంటున్నారు. తన మద్దతుదారుల కోసం రాజగోపాల్ ఇప్పటికే చౌటుప్పల్, మునుగోడు హెడ్ క్వార్టర్స్ లో 15 ఇళ్ళను అద్దెకు తీసేసుకున్నారట. డిమాండును దృష్టిలో పెట్టుకుని యజమానులు అద్దెలను కూడా బాగా పెంచేస్తున్నారట. రు. 10 వేలున్న డబల్ బెడ్ రూం ఇల్లు ఇపుడు రు. 20 వేలు చెబుతున్నారట.

ఇక కమర్షియల్ గా సింగిల్ షట్టర్ ఉన్న గది అద్దె 10 వేల నుండి 15 వేల రూపాయలు చెబుతున్నారట. అలాగే ప్రచార సామగ్రి తయారుచేసే వాళ్ళకు కూడా ఫుల్లుగా డిమాండ్ పెరిగిపోతోందట. ఇక రైతులు అయితే తమ పొలాలను అద్దెలకు ఇస్తున్నారట. బహిరంగసభలు నిర్వహించాలంటే కనీసం 20 ఎకరాలు అవసరం. ప్రతిపార్టీ కనీసం ఐదు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దాంతో రైతులు ఎకరాకు ఇంతాని డబ్బులు మొత్తాన్ని ముందుగానే తీసేసుకుంటున్నారట. పార్టీలతో పొలాలను కొంతకాలానికి లీజుకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారట. మొత్తానికి ఉపఎన్నిక పుణ్యమాని అంతా డిమాండ్ పెరిగిపోతోంది.

This post was last modified on August 15, 2022 12:28 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

39 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago