వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీచేసే విషయంలో చంద్రబాబు నాయుడు కొత్త రూల్ అమలు చేయబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారట. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటయ్యా అంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అట. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఒక కుటుంబంలోని వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తానని స్పష్టంగా చెప్పారు. వీలైనంతమందికి టికెట్ల కేటాయింపులో అవకాశం ఇవ్వటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయ్యుండచ్చు.
అయితే చంద్రబాబు పెట్టిన కొత్తరూలు ఎంతవరకు అమలవుతుంది? ఎంతవరకు పార్టీకి లాభదాయకం అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే పార్టీలోని చాలామంది సీనియర్ నేతల కుటుంబాల్లో కనీసం రెండు టికెట్లను ఆశిస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. ముఖ్యంగా రాయలసీమలో ఇలాంటి సీనియర్ల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. సొంతజిల్లా చిత్తూరులోను, కడపలోను పెద్దగా ఉండకపోవచ్చు కానీ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.
అనంతపురంలో పరిటాల ఫ్యామిలి, జేసీ బ్రదర్స్ కుటుంబం రెండు టికెట్లను ఆశిస్తున్నాయి. అలాగే కర్నూలులో కేఇ కుటుంబం మూడు టికెట్లను ఆశిస్తున్నది. కోట్ల కుటుంబం రెండు టికెట్లను, భూమా కుటుంబం రెండు టికెట్లపై ఆశలు పెట్టుకున్నది. అలాగే చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించిన డీకే కుటుంబం కూడా చిత్తూరు ఎంఎల్ఏ, రాజంపేట ఎంపీ, తిరుపతి ఎంఎల్ఏ టికెట్లను ఆశిస్తోంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబం కూడా పుంగనూరు, పలమనేరు టికెట్లను ఆశిస్తున్నది.
నిజానికి కోట్ల కుటుంబం మినహా మిగిలిన కుటుంబాలన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ప్రవేశించి టికెట్లను ఆశించడం లేదు. చాలా సంవత్సరాలుగా పార్టీలోనే పనిచేస్తున్నాయి. పైగా వీళ్ళు కాకుండా మరొకరికి టికెట్ కేటాయిస్తే అంగ, అర్ధబలాల్లో తట్టుకోవటం కూడా కష్టమనేట్లుగా రాజకీయాలు తయారైపోయాయి. ఇక ఉత్తరాంధ్రలో తీసుకుంటే రెండు టికెట్లను ఆశిస్తున్న కింజరాపు, చింతకాయల, బండారు, కిమిడి, పూసపాటి లాంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి వీళ్ళందరినీ చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…