Political News

దెబ్బకు వెనక్కు తగ్గిన కేసీయార్?

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీయార్ వెనక్కు తగ్గినట్లే ఉంది. మొన్నటివరకు కూసుకుంట్ల ప్రభాకరరెడ్డే అభ్యర్ధిగా పార్టీలో బాగా ప్రచారమైంది. ముందు మంత్రి జగదీశ్వరరెడ్డి, తర్వాత కేసీయార్ కూడా నేతలతో జరిపిన సమావేశంలో కూసుకుంట్లే అభ్యర్ధి అన్నట్లుగా మాట్లాడారు. అయితే వీళ్ళు ఊహించని విధంగా కూసుకుంట్లకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని సుమారు 40 మంది నేతలు ఎదురుతిరిగారు. వీళ్ళని కన్వీన్స్ చేయటానికి ఎంత ప్రయత్నించినా కేసీయార్ వల్లకాలేదు.

దాంతో తాజాగా పార్టీ నేతలతో మాట్లాడుతు అభ్యర్ధిని ఇంకా ఎంపికచేయలేదని ప్రకటించారు. ఎవరిని అభ్యర్ధిగా ప్రకటించినా నేతలంతా గెలుపుకోసం కష్టపడాలని విజ్ఞప్తిచేశారు. శనివారం మూడు విడుతలుగా కేసీయార్ నేతలతో మాట్లాడిన కూసుకుంట్లతో మాత్రం భేటీ జరపలేదు. వివిధ భేటీల్లో కూసుకుంట్ల ప్రస్తావన కూడా కేసీయార్ తేలేదని సమాచారం. అభ్యర్ధి ఎంపిక విషయంలో నల్గొండ ఎంఎల్ఏ కంచర్ల భూపాలరెడ్డి సోదరులతో కూడా మాట్లాడారు.

మొత్తానికి అభ్యర్ధి ఎంపిక విషయం ఏకపక్షంగా సాధ్యంకాదని కేసీయార్ కు బాగా అర్ధమైపోయింది. మామూలుగా అయితే అధినేత తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని నేతలు థిక్కరించేంత సాహసంచేయరు. తమకు ఏదన్నా అసంతృప్తి ఉంటే విడిగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేసీయార్ మొహంమీద తమ అసంతృప్తిని నేతలు చెప్పేశారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లు, సర్పంచులు వ్యతిరేకిస్తున్న కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికే టికెట్ ఇస్తారా లేకపోతే అభ్యర్ధిని మారుస్తారా అనేది చూడాలి.

ఇంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతను అభ్యర్ధిగా ఎంపికచేస్తే అందరు కలిసి పుట్టిముంచేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. అభ్యర్ధి ఓడిపోతే పోయేది తనపరువే అని కేసీయార్ కు తెలీదా ? ఒకవైపు కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది తామే అంటు కాంగ్రెస్, బీజేపీ గోల. ఈ నేపధ్యంలో కేసీయార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

This post was last modified on August 14, 2022 6:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

18 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago