రాజకీయాల్లో నేరచరితులు ఉండకూడదని ఒకవైపు జనాలు నానా గోలచేస్తుంటే మరోవైపు రాజకీయపార్టీలు ఎక్కువగా నేరచరితులకు ప్రాధాన్యతిస్తున్నాయి. దేశంలోని అన్నీపార్టీలు దాదాపు ఇదే పద్దతిలో ముందుకు వెళుతున్నాయి. బహిరంగసభల్లో పార్టీలు చెప్పేదొకటి, అవసరానికి చేస్తున్నదొకటిగా ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అసోసియేష్ ఫర్ డమొక్రటికి రిఫార్స్మ్ (ఏడీఆర్) అనే సంస్ధ మన రాజకీయాల్లోని నేరచరితుల చిట్టాను ఎప్పటికప్పుడు బయటపెడుతునే ఉంది.
ఇపుడిదంతా ఎందుకంటే ఏపీలోని పెద్దలసభగా చెప్పుకునే శాసనమండలిలోని నేరచరితుల బండారం బయటపెట్టింది. ఏడీఆర్ బయటపెట్టిన జాబితా ప్రకారం మొత్తం 58 మంది సభ్యుల్లో 20 మందిపైన క్రిమినల్ కేసులున్నాయట. అంటే దాదాపు 40 మంది సభ్యులపై క్రిమినల్ కేసులున్నట్లే లెక్క. ఇంతమంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న సభ్యులున్న సభ పెద్దలసభ ఎలాగ అవుతుందన్నదే జనాలను పట్టిపీడిస్తున్న ప్రశ్న.
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 20 మంది సభ్యుల్లో 13 మంది అధికార వైసీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఆరుమందుంటే ఒక సభ్యుడు పీడీఎఫ్ సభ్యుడు కావటం గమనార్హం. అంటే వైసీపీ, టీడీపీలను గమనిస్తే రెండుపార్టీలు కూడా నేరచరితులను యధేచ్చగా ప్రోత్సహిస్తున్నట్లు అర్ధమవుతోంది. 58 మందిలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎంఎల్సీలు అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు అఫిడవిట్లు అందుబాటులో లేవు. అలాగే మరో ఎనిమిదిమంది నామినేటెడ్ ఎంఎల్సీలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవటంతో వాళ్ళ చరిత్ర అందుబాటులో లేదని ఏడీఆర్ ప్రకటించింది.
అంటే ఈ పదిమంది ఎంఎల్సీలను పక్కనపెడితే అందుబాటులో ఉన్న 48 మంది ఎంఎల్సీల అఫిడవిట్ల ప్రకారం చూస్తే 20 మందిపై క్రిమినల్ రికార్డులుండటం ఆశ్చర్యంగా ఉంది. నేరచరిత్రున్న ఈ 20 మందిలో కూడా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురూ వైసీపీ నేతలే కావటం గమనార్హం. దువ్వాడ శ్రీనివాస్, గంగుల ప్రభాకరరెడ్డి, అనంతసత్య ఉదయభాస్కర్ పై హత్యాయత్నం, దోపిడి, చోరీ, మారణాయుధాల వినియోగం, అల్లర్లు, దాడుల కేసులు, వివిధ వర్గాల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొట్టిన కేసులున్నాయి. రాజకీయాల్లో నేరచరితులుండకూడదనే నినాదం నేతిబీరకాయ చందంగానే తయారైంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…